కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ హైద్రాబాద్ కు చేరుకొంది. ఈ వ్యాక్సిన్ ను నగరంలోని కోఠి డీఎంఈ కార్యాలయంలో భద్రపర్చారు. ఇక్కడి నుండి రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాలకు వ్యాక్సిన్ ను ప్రత్యేకంగా రవాణా చేయనున్నారు వైద్య ఆరోగ్య శాఖాధికారులు.
హైదరాబాద్:కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ హైద్రాబాద్ కు చేరుకొంది. ఈ వ్యాక్సిన్ ను నగరంలోని కోఠి డీఎంఈ కార్యాలయంలో భద్రపర్చారు. ఇక్కడి నుండి రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాలకు వ్యాక్సిన్ ను ప్రత్యేకంగా రవాణా చేయనున్నారు
also read:హైద్రాబాద్కి చేరుకొన్న కరోనా వ్యాక్సిన్: 1213 సెంటర్లలో వ్యాక్సినేషన్
తెలంగాణలో తొలి విడత కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తొలి విడతలో సుమారు 5 లక్షల డోసులు తెలంగాణకు రానుంది. ఈ క్రమంలోనే మంగళవారం నాడు 3.72 లక్షల డోసుల వ్యాక్సిన్ హైద్రాబాద్ కు చేరుకొంది.
తెలంగాణ రాష్ట్రంలోని 866 కోల్డ్ స్టోరేజీ పాయింట్ల ద్వారా ఆయా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వ్యాక్సిన్ పంపనున్నారు.రాష్ట్రంలోని 1213 వ్యాక్సిన్ సెంటర్లలో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ సన్నాహక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన డ్రైరన్ విజయవంతమైంది.