పేలిన ఫ్రిజ్.. విద్యార్థిని మృతి

Published : Dec 28, 2018, 12:18 PM IST
పేలిన ఫ్రిజ్.. విద్యార్థిని మృతి

సారాంశం

రంగారెడ్డి జిల్లా బొంగులూరులో విషాదం చోటు చేసుకుంది. ఫ్రిజ్‌ కంప్రెజర్‌ పేలడంతో ఇంజినీరింగ్‌ విద్యార్థి దీపిక సజీవదహనమైంది. 

రంగారెడ్డి జిల్లా బొంగులూరులో విషాదం చోటు చేసుకుంది. ఫ్రిజ్‌ కంప్రెజర్‌ పేలడంతో ఇంజినీరింగ్‌ విద్యార్థి దీపిక సజీవదహనమైంది. ఫ్రిజ్‌ డోర్‌ తీసేందుకు ప్రయత్నించిన సమయంలో పేలుడు జరిగింది. కంప్రెజర్‌ పేలుడుతో మంటలు అంటుకుని దీపిక అక్కడికక్కడే మృతి చెందింది.

ఫ్రిజ్ డోర్ ఎగిరి పక్కన పడిపోయింది. భారీ ఎత్తున మంటలు వ్యాపించి.. విద్యార్థిని కి అంటుకున్నాయి. కాగా.. ఫ్రిజ్ ఎలా, ఎందుకు పేలిందనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. కూతురు ఇలా అకస్మాత్తుగా చనిపోవడాన్ని దీపిక తల్లిదండ్రులు తట్టుకోలేక పోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad పక్కన మరో నయా సిటీ.. 11 జోన్లతో బొమ్మ అద్దిరిపోయేలా ప్లాన్ చేసిన రేవంత్ సర్కార్
IMD Rain Alert : ఒకేసారి ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎటాక్.. ఈ తెలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం కంటిన్యూ