తెలంగాణలో రూ. 200 కోట్ల పెట్టుబడులు.. భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ గ్లోబల్ నిర్ణయం.. ప్రకటించిన కేటీఆర్

Published : Apr 12, 2022, 01:35 PM ISTUpdated : Apr 12, 2022, 01:37 PM IST
తెలంగాణలో రూ. 200 కోట్ల పెట్టుబడులు.. భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ గ్లోబల్ నిర్ణయం.. ప్రకటించిన కేటీఆర్

సారాంశం

తెలంగాణకు మరో రూ. 200 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ గ్లోబల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రకటించారు. జీనోమ్ వ్యాలీలో ఇంజెక్టెబుల్, వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బీఎస్‌వీ గ్లోబల్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.  

హైదరాబాద్: భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ గ్లోబల్ (బీఎస్‌వీ గ్లోబల్) సంస్థ తెలంగాణలో రూ. 200 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం అయింది. జీనోమ్ వ్యాలీలో రూ. 200 కోట్ల పెట్టుబడులతో ఇంజెక్టెబుల్, వ్యాక్సిన్ తయారీ ఫెసిలిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

రూ. 200 కోట్ల పెట్టుబడులతో జీనోమ్ వ్యాలీలో బీఎస్‌వీ గ్లోబల్ ఇంజెక్టెబుల్, వ్యాక్సిన్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నదని ప్రకటించడానికి సంతోషంగా ఉన్నదని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్‌లో బీఎస్‌వీ గ్లోబల్ ఎండీ సంజీవ్ స్నవంగుల్ జీకి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ప్రపంచానికి టీకా కేంద్రం అనే విషయాన్ని ఈ నిర్ణయం బలపరుస్తున్నదని పేర్కొన్నారు.

బయోలాజికల్, బయోటెక్, ఫార్మాస్యూటికల్ ప్రాడక్ట్‌లలో కంపెనీకి విశేష కీర్తి ఉన్నది. గైనకాలజీ, పునరుత్పత్తికి సహకరించే టెక్నాలజీ, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ మెడికల్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, హెమటాలజీ, యూరాలజీలలో ఈ కంపెనీ కృషి ఉన్నది.

పెట్టుబడుల కోసం ఇటీవలే కేటీఆర్ యూఎస్ టూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఏ అవకాశం చిక్కినా ఎంట్రాప్రెన్యూయర్లను హైదరాబాద్ వైపు రప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి పరిణామమే ఈ నెల 4న ట్విట్టర్‌లో చోటుచేసుకుంది. టెక్ ఎంట్రాప్రెన్యూయర్లకు టాప్ సిటీ హైదరాబాదా? బెంగళూరా అనే చర్చ జరిగింది. ఇది కామన్ మెన్ మధ్య జరిగిన చర్చ కాదు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్‌ల మధ్య ట్విట్టర్ ఎక్స్‌చేంజ్ జరిగింది. అంతేకాదు, పరస్పరం సవాళ్లు చేసుకుని అంగీకరించారు కూడా. ఆ చర్చ ఇలా సాగింది.

హౌజింగ్ డాట్ కామ్, ఖాతాబుక్ స్టార్టప్‌ల వ్యవస్థాపకుడు రవీశ్ నరేశ్ ఇటీవలే బెంగళూరులో మౌలిక సదుపాయాల గురించి ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. బెంగళూరులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ప్రతి రోజూ విద్యుత్ కోతలు ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. మరో స్టార్టప్ చీఫ్ కూడా ఆయన వాదనలతో అంగీకరించారు. ఈ సంభాషణలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా జాయిన్ అయ్యారు. బ్యాగులు సర్దుకుని హైదరాబాద్ వచ్చేయండి అని వారికి సూచించారు. ఇక్కడ మెరుగైన వసతులు ఉన్నాయని, తాము ముఖ్యంగా ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్‌పైన ఫోకస్ పెడుతున్నామని వివరించారు.

ఈ ట్వీట్‌పై కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ రియాక్ట్ అయ్యారు. మై ఫ్రెండ్ కేటీఆర్.. మీ సవాలును స్వీకరిస్తున్నా అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరికల్లా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తెలిపారు. ఆ తర్వాత దేశంలో బెస్ట్ సిటీగా బెంగళూరు ఘనతను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ కూడా మళ్లీ జవాబు ఇచ్చారు. ప్రియమైన డీకే శివకుమార్ అన్నా.. కర్ణాటక రాజకీయాల గురించి తనకు పెద్దగా తెలియదని, ఎవరు గెలుస్తారో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. కానీ, సవాల్‌ను మాత్రం స్వీకరిస్తున్నట్టు వివరించారు. యువతకు ఉపాధిని కల్పించడంలో ఆరోగ్యకరమైన వాతావరణంలో హైదరాబాద్, బెంగళూరు నగరాలు పోటీ పడనిద్దాం అని తెలిపారు. కాబట్టి, హలాల్, హిజాబ్‌లపై కాదు.. ఐటీ అండ్ బీటీ, మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్ పెడదామని వివరించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !