అతీక్ అహ్మద్ కంటే కేసీఆర్ ప్రమాదకరం.. బండి సంజయ్ సంచలనం..

Published : Apr 26, 2023, 12:18 PM IST
అతీక్ అహ్మద్ కంటే కేసీఆర్ ప్రమాదకరం.. బండి సంజయ్ సంచలనం..

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల యూపీలో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కంటే కేసీఆర్ ప్రమాదకరమని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల యూపీలో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కంటే కేసీఆర్ ప్రమాదకరమని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్‌స్టర్లందరికీ సీఎం కేసీఆర్ గ్యాంగ్‌స్టర్ అని విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన  నిరుద్యోగ మార్చ్​లో బండి సంజయ్ మాట్లాడుతూ.. అతీక్ అహ్మద్ తుపాకీతో ప్రజలను దోచుకుంటే.. కేసీఆర్ పోలీసుల సహాయంతో ప్రజలను, వారి భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. అయితే భయపడాల్సిన పనిలేదని.. లక్ష్యం సాధించే వరకు కేసీఆర్‌తో పోరాడుతూనే ఉంటామని అన్నారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌ వల్ల 30 లక్షల మంది నిరుద్యోగ యువత కెరీర్‌కు ప్రమాదం వాటిల్లడానికి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే కారణమని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ‘‘కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించి.. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువతకు రూ.లక్ష పరిహారం చెల్లించే వరకు మేం విశ్రమించబోం’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. 

కేసీఆర్ ప్రభుత్వ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని విమర్శించారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగుల కోసం పోరాడుతున్న తనను టెన్త్ పేపర్ లీక్ కేసులో ఇరికించి జైలుకు పంపాలని కేసీఆర్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. జైలుకు వెళ్లడం తనకు కొత్తేమీ కాదని అన్నారు. తాను తొమ్మిది సార్లు జైలుకు వెళ్లానని చెప్పారు. తెలంగాణకు ఎదురైన ప్రతి సమస్యపై బీజేపీ కార్యకర్తలు పోరాడి లాఠీ దెబ్బలు తిన్నారని, జైళ్లకు వెళ్లారని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వివిధ ఉద్యోగాల భర్తీకి 21 నోటిఫికేషన్లు ఇచ్చిందని.. అయితే అందులో ఒక్కటి కూడా విజయవంతంగా పూర్తి చేయలేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను బండి సంజయ్ సమర్ధించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్ల కాపీని ముక్కలు చేసి, వాటిని డస్ట్‌బిన్‌లో పారేస్తుందని అన్నారు. 

తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో హిందువులు అవమానాలకు గురవుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర సచివాలయ నిర్మాణంలో అలాంటి వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ‘‘సచివాలయం ఆవరణలో నల్ల పోచమ్మ ఆలయానికి కేవలం 2.5 గుంటల భూమి కేటాయిస్తే.. మసీదు నిర్మాణానికి ఐదు గుంటలు కేటాయించారు. జనాభాలో 80 శాతం ఉన్న హిందువులపై వివక్ష కాదా?’’ అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే నేరుగా లెక్కలు తేల్చుకుంటామని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా సచివాలయంలో తగిన మార్పులు చేస్తామని, నల్ల పోచమ్మ ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా తీర్చిదిద్ది దేవతాశక్తిని చాటిచెబుతామని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్