రహస్యంగా పెళ్లి : కూతురు ప్రేమను అంగీకరించని తల్లిదండ్రులు... అల్లుడి ఇంటిపై మూకుమ్మడి దాడి

By Siva KodatiFirst Published Aug 1, 2021, 8:15 PM IST
Highlights

ప్రేమ పెళ్లి చేసుకున్న అబ్బాయి కుటుంబంపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. మరోవైపు అబ్బాయి కుటుంబ సభ్యులు కూడా అమ్మాయి ఇంటిపై దాడి చేసేందుకు సిద్ధం కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఎంతగా కృషి చేస్తున్నా దేశంలో నిత్యం ఏదో ఒక మూల పరువు హత్యలు జరుగుతూనే వున్నాయి. ఇక భౌతిక దాడులకు లెక్కేలేదు. తాజాగా ప్రేమ పెళ్లి చేసుకున్న అబ్బాయి కుటుంబంపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మెట్‌పల్లి పట్టణానికి చెందిన పెద్దగొండ ప్రవీణ్ , సౌమ్య అనే ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని అమ్మాయిని తమతో పాటు తీసుకెళ్లారు. దీంతో యువకుడు పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడగా రాజీ కుదరలేదు.

ఈ  క్రమంలో ఆదివారం అమ్మాయి మళ్ళీ అబ్బాయికి ఫోన్ చేయగా అతను ఆమెను తన ఇంటికి తీసుకుకెళ్లాడు. దీంతో తీవ్ర ఆగ్రహనికి గురైన అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటికి వెళ్లి దాడికి దిగారు. ఈ  ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు నచ్చజెబుతున్నారు. మరోవైపు అబ్బాయి కుటుంబ సభ్యులు కూడా అమ్మాయి ఇంటిపై దాడి చేసేందుకు సిద్ధం కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..

click me!