టీఆర్ఎస్ ఎంపీ నామా కు షాక్.. ’’రాంచీ’’ కేసులో మధుకాన్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

Siva Kodati |  
Published : Jul 02, 2022, 03:14 PM ISTUpdated : Jul 02, 2022, 03:16 PM IST
టీఆర్ఎస్ ఎంపీ నామా కు షాక్.. ’’రాంచీ’’  కేసులో మధుకాన్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

సారాంశం

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు షాకిచ్చింది ఈడీ. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే కేసులో మధుకాన్ కు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మొత్తం 105 ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ శనివారం ప్రకటించింది.

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు షాకిచ్చింది ఈడీ. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే కేసులో మధుకాన్ కు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మొత్తం 105 ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ శనివారం ప్రకటించింది. రూ.96 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. 

ఈ కేసుకు సంబంధించి గతేడాది జూన్ లో నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకుని ఆ డబ్బును దారి మళ్లించినట్లు ఆరోపణలు వున్నాయి. రూ.1064 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు వున్నాయి. ఈ క్రమంలోనే నామా నివాసంతో పాటు కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆ రుణానికి సంబంధించి నాగేశ్వరరావు పర్సనల్ గ్యారంటీర్ గా వున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

రూ. 1641 కోట్ల‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం.. ఈ రెండు ప‌ట్ట‌ణాల మ‌ధ్య త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం
Fertility: తెలంగాణ‌లో ప‌డిపోతున్న సంతానోత్ప‌త్తి.. ఫెర్టిలిటీ చికిత్సల్లో పారదర్శకత పెరగాల్సిందే