శంషాబాద్‌లో భారీగా ఐ ఫోన్లు స్వాధీనం: ఇద్దరి అరెస్ట్

Published : Jun 24, 2021, 09:08 PM IST
శంషాబాద్‌లో భారీగా ఐ ఫోన్లు స్వాధీనం: ఇద్దరి అరెస్ట్

సారాంశం

 హైద్రాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం నాడు కోటి  రూపాయాలకు పైగా  విలువైన 80 ఐ ఫోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

హైదరాబాద్: హైద్రాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం నాడు కోటి  రూపాయాలకు పైగా  విలువైన 80 ఐ ఫోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.షార్జా నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుండి ఐ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు.  లగేజీ బెల్ట్  వద్ద లగేజీ తీసుకొని బయటకు వెళ్తున్న సమయంలో తనిఖీలు నిర్వహించగా ఐ ఫోన్లు లభ్యమయ్యాయి. ఐ ఫోన్లను పన్నులు చెల్లించకుండా అక్రమంగా ఐ ఫోన్లుగా గుర్తించినట్టుగా కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జేఎస్ చంద్రశేఖర్ తెలిపారు.

ఐ ఫోన్ 12 ఫ్రో, ఐ ఫోన్ 12 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయని అధికారులు తెలిపారు. ఒక్కొక్క మొబైల్ విలువ  లక్ష  నుండి లక్షన్నర విలువ చేస్తాయని కస్టమ్స్ అధికారులు వివరించారు.నిందితుల నుండి రూ. 4 లక్షల నగదును కూడ స్వాధీనం చేసుకొన్నారు. అరెస్టైన ఇద్దరిలో ఒకరు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు కాగా, మరో వ్యక్తి  హైద్రాబాద్ కు చెందిన వారని కస్టమ్స్ అధికారులు వివరించారు.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu