
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,484 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 185 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,79,430కి చేరింది. కరోనా కారణంగా ఒక్కరు మృతి చెందారు. వీటితో కలిపి తెలంగాణలో (corona deaths in telangana) వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,014కి చేరింది. కోవిడ్ వల్ల నిన్న 205 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు రికవరీల సంఖ్య 6,71,655కి చేరుకుంది. తెలంగాణలో ప్రస్తుతం 3,761 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు దక్షిణాఫ్రికాలో (south africa) పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మనదేశంలోకి అడుగుపెట్టిన ఈ వైరస్ (coronavirus) మరింత విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాలను సైతం ఈ మహమ్మారి భయపెడుతోంది. తాజాగా తెలంగాణలో (omicron cases in telangana) శనివారం కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 10 మందికి కొత్తగా ఈ వేరియంట్ నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో రిస్క్ దేశాల నుంచి తెలంగాణకు వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వచ్చినట్లు పేర్కొన్నారు.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 1, జీహెచ్ఎంసీ 78, జగిత్యాల 3, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 5, ఖమ్మం 14, మహబూబ్నగర్ 5, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 6, మంచిర్యాల 2, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 15, ములుగు 1, నాగర్ కర్నూల్ 2, నల్గగొండ 7, నారాయణపేట 2, నిర్మల్ 2, నిజామాబాద్ 1, పెద్దపల్లి 4, సిరిసిల్ల 0, రంగారెడ్డి 14, సిద్దిపేట 2, సంగారెడ్డి 3, సూర్యాపేట 0, వికారాబాద్ 5, వనపర్తి 1, వరంగల్ రూరల్ 1, హనుమకొండ 11, యాదాద్రి భువనగిరిలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి.