ఐడీఏ బొల్లారంలో బాయిలర్ బ్లాస్ట్, ఒకరి మృతి

By Siva KodatiFirst Published Feb 21, 2021, 6:14 PM IST
Highlights

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. పారిశ్రామిక వాడలోని ఖైతాన్ కంపెనీలో బాయిలర్ పేలింది. 

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. పారిశ్రామిక వాడలోని ఖైతాన్ కంపెనీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!