మరింత ఎక్కువగా మొబైల్ డేటా.. ఎయిర్ టెల్ నయా ఆఫర్

First Published Jul 3, 2018, 1:57 PM IST
Highlights

ఎయిర్ టెల్ కష్టమర్లకు బంపర్ ఆఫర్

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ మరోసారి కష్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. జియోకి పోటీగా మరింత ఎక్కువ మొబైల్ డేటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఎయిర్‌టెల్ రూ.649 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అందిస్తున్న మొబైల్ డేటా పరిమితిని మరింత పెంచింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్‌లో కస్టమర్లకు బిల్ సైకిల్‌లో 50 జీబీ డేటా మాత్రమే లభించేది. కానీ ఇకపై 90 జీబీ డేటా లభిస్తుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది. 

దీంతోపాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ యథావిధిగా ఈ ప్లాన్‌లో వస్తాయి. ఇక వీటితోపాటు వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ టీవీ ఉచిత సబ్‌స్క్రిప్షన్, ఉచిత హ్యాండ్ సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌లు లభిస్తాయి.

click me!