పబ్-జి మొబైల్ రిలాంచ్ డేట్ పై పబ్-జి ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. కారణం ఏంటంటే ?

By S Ashok KumarFirst Published Dec 3, 2020, 2:17 PM IST
Highlights

భారత ప్రభుత్వంతో పబ్-జి ప్రమోటర్ల సమావేశం అభ్యర్థనపై ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎం‌ఈ‌ఐ‌టి‌వై) ఇంకా స్పందించలేదని వర్గాలు పేర్కొనడంతో పబ్-జి మొబైల్ భారతదేశంలో త్వరలో విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

గతకొద్ది రోజులుగా ఇండియాలోకి పబ్-జి  రిఎంట్రీపై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పబ్-జి ఫ్యాన్స్ కి నిరాశే ఎదురుకానుంది. ఎందుకంటే పబ్-జి సరికొత్త వెర్షన్ లో ఇండియాలోకి రిఎంట్రీ ఇవ్వనున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం వెల్లడైంది. 
 
భారత ప్రభుత్వంతో పబ్-జి ప్రమోటర్ల సమావేశం అభ్యర్థనపై ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎం‌ఈ‌ఐ‌టి‌వై) ఇంకా స్పందించలేదని వర్గాలు పేర్కొనడంతో పబ్-జి మొబైల్ భారతదేశంలో త్వరలో విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

ఒక నివేదిక ప్రకారం పబ్-జి ప్రమోటర్లు 4 వారాల క్రితం భారత ప్రభుత్వంతో సమావేశం కోసం అభ్యర్థించారు, కాని కేంద్రం ఈ అభ్యర్థనపై ఇంకా స్పందించలేదు.

also read 

"సమావేశం కోసం చేసిన అభ్యర్థనపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. భారత ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను పాటించడానికి పబ్-జి గేమ్ ప్రమోటర్లు సిద్ధంగా ఉన్నారు. కాని ఎం‌ఈ‌ఐ‌టి‌వై కార్యాలయం నుండి ఎటువంటి స్పందన రాలేదు" అని పబ్-జి ప్రమోటర్లకు దగ్గరగా ఉన్న వర్గాలు తెలిపాయి.

పబ్-జి త్వరలో భారతదేశంలో తిరిగి రాబోతోందని కొద్దిరోజులుగా పలు మీడియా నివేదికలు పేర్కొంటున్నప్పటికి వాస్తవం ఏమిటంటే, భారతదేశంలోకి పబ్-జి తిరిగి రావడానికి కంపెనీ భారత ప్రభుత్వం నుండి అనుమతి పొందవలసి ఉంది.

ఇండియాలోకి రిఎంట్రీ కోసం అనుమతి పొందడంలో సమావేశం తమకు సహాయపడుతుందని పబ్-జి ప్రమోటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని పబ్-జి సన్నిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరికి ముందు భారతదేశంలో పబ్-జి రిఎంట్రీ చాలా కఠినమైనదిగా అనిపిస్తుందని మూలలు తెలిపాయి.

సెప్టెంబరులో భారత ప్రభుత్వం వందకు పైగా చైనీస్ యాప్‌లతో పాటు భారతదేశంలో పబ్-జి మొబైల్‌ను నిషేధించిన విషయం మీకు తెలిసిందే.

కొద్ది రోజుల క్రితం మైక్రోసాఫ్ట్ అజూర్ తన సర్వర్లు, డేటా సెంటర్లలో గేమ్ ను హోస్ట్ చేయడానికి పబ్-జి మొబైల్‌తో భాగస్వామ్యం పొందే అవకాశం ఉంది, భారతదేశంలో పబ్-జి రిఎంట్రీ గురించి సంస్థకి ఇంకా ప్రభుత్వం ఎటువంటి సమాచారం రాలేదని తెలిపింది.

click me!