ఇక పై 100 ఎస్‌ఎంఎస్‌లు దాటితే నో చార్జెస్..

Ashok Kumar   | Asianet News
Published : Jun 06, 2020, 01:10 PM IST
ఇక పై 100 ఎస్‌ఎంఎస్‌లు దాటితే నో చార్జెస్..

సారాంశం

వంద ఎస్‌ఎంఎస్‌లు దాటితే తరువాత చేసే ప్రతి ఎస్‌ఎంఎస్‌కి ఛార్జీలు వసూలు చేసేది. ఇకపై రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు దాటి పంపించినా ఎటువంటి చార్జీలుండవు అని ట్రాయ్ తెలిపింది. 

 టెలికాం రేగులేటరీ అతారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బిజినెస్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇకపై రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు దాటి పంపించినా ఎటువంటి చార్జీలుండవు అని ట్రాయ్ తెలిపింది. 4

అంతకుముందు రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు మాత్రమే చేసుకోవడానికి వీలుండేది. వంద ఎస్‌ఎంఎస్‌లు దాటితే తరువాత చేసే ప్రతి ఎస్‌ఎంఎస్‌కి ఛార్జీలు వసూలు చేసేది. ఇకపై రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు దాటి పంపించినా ఎటువంటి చార్జీలుండవు అని ట్రాయ్ తెలిపింది.

ఇప్పటివరకు ఒక్కో సిమ్ నుంచి రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పంపించేందుకు వీలు ఉంది. ఆపైన పంపించే ప్రతీ ఎస్‌ఎంఎస్‌కు 50 పైసలు చొప్పున వసూలు చేయాలని టెలికాం ఆపరేటర్లకు ట్రాయ్ నిబంధన పెట్టింది. అప్పట్లో టెలీ మార్కెటింగ్, ఫెక్ మెసేజ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్ ఈ నిర్ణయం

also read ఫేస్‌బుక్ ఉద్యోగుల రాజీనామా..దిగొచ్చిన సీఈఓ మార్క్ జుకర్ బర్గ్..

తీసుకుంది. తాజాగా బిజినెస్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ట్రాయ్ ఆ నిబంధనను ఎత్తివేసింది. ఈ మేరకు టెలికాం టారిఫ్ రూల్స్- 2012లోని దానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనను తొలిగిస్తు సవరణ చేసింది.

మొబైల్ ఇంటర్నెట్ వినియోగానికి ముందు ఎస్‌ఎం‌ఎస్ చేసుకోవడానికి ఆఫర్లు ఉండేవి కానీ ఎస్‌ఎంఎస్‌లు వాడకంలో ఫెక్ మెసేజ్‌లు ఎక్కువగా వ్యాపిస్తుండటంతో రోజుకి ఈ నిబంధనను తీసుకొచ్చింది.

PREV
click me!

Recommended Stories

Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే