జడేజాను కొట్టబోయిన ఇషాంత్.. ఆలస్యంగా వెలుగులోకి

By sivanagaprasad kodatiFirst Published Dec 18, 2018, 1:55 PM IST
Highlights

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య స్వల్పంగా మాటల యుద్ధం జరిగింది. అయితే ఆసక్తికరంగా టీమిండియా క్రికెటర్లు ఇషాంత్, జడేజా మధ్య గొడవ జరిగి.. జడేజాను శర్మ కొట్టబోయాడట. 

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య స్వల్పంగా మాటల యుద్ధం జరిగింది. అయితే ఆసక్తికరంగా టీమిండియా క్రికెటర్లు ఇషాంత్, జడేజా మధ్య గొడవ జరిగి.. జడేజాను శర్మ కొట్టబోయాడట.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన క్రికెట్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. నాలుగో రోజు ఆటలో భాగంగా సోమవారం భారత జట్లు ఫీల్డింగ్ చేస్తోంది. ఈ సమయంలో ఫీల్డింగ్ కూర్పులో భాగంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

అది తారాస్థాయికి చేరడంతో ఒకానొక దశలో జడేజాపైకి దూసుకెళ్లిన ఇషాంత్ చేయి చేసుకునేలా కనిపించాడు. అయితే ఆ సమయంలో పక్కనే ఉన్న మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ వారిని విడదీసే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ వీరిపై మండిపడుతున్నారు.

click me!