భారత్ - పాక్ మ్యాచ్ కూడా కష్టమే?

By Prashanth MFirst Published Jun 14, 2019, 9:51 AM IST
Highlights

ఐసిసి ప్రపంచ కప్ లో గురువారం నాలుగో మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. భారత్ న్యూజిల్యాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కి వరుణుడి దెబ్బ పడింది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అయితే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.

ఐసిసి ప్రపంచ కప్ లో గురువారం నాలుగో మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. భారత్ న్యూజిల్యాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వరుణుడి దెబ్బ పడింది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అయితే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. నిన్న నాటింగ్‌హామ్‌ లో జరగాల్సిన మ్యాచ్ కోసం నిర్వాహకులు చాలా కష్టపడ్డారు. 

ఇంగ్లాండ్ కాలమానం ప్రకారం 3 గంటల వరకు అంపైర్లు స్టేడియంను పరిశీలించారు. అవుట్ ఫీల్డ్ అనుకూలంగా మరలేకేపోయింది. వర్షం నీరు ఇబ్బంది పెట్టడంతో చివరకు మ్యాచ్ రద్దయింది. ఇక ఇప్పుడు ఆదివార మాంచెస్టర్‌ లో  జరగబోయే భారత్ - పాక్ మ్యాచ్ పై కూడా టెన్షన్ మొదలైంది. 

వరల్డ్ కప్ లో మొత్తంగా హాట్ ఫెవేరేట్ అయినా ఈ మ్యాచ్ కోసం భారత్ పాక్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మ్యాచ్ కి వరుణుడి ఎఫెక్ట్ తప్పేలా లేదు. నాటింగ్‌హామ్‌ మాదిరిగానే మాంచెస్టర్‌ లో కూడా వాతావరణం అనుకూలించేలా లేదని తెలుస్తోంది. 

సూర్యుడిని చూసి చాలా రోజులు అవుతోందని అక్కడి స్థానికులు చెబుతుంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు బ్లాక్ లో లక్షలు పెట్టి మరి టికెట్స్ కొనుక్కున్నారు. మరి ఆదివారం వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి. 

click me!