ఏంటి ఆ సీక్రెట్ స్టోరీ..? వైరల్ గా కశ్యప్ ట్వీట్

By ramya neerukondaFirst Published Dec 19, 2018, 4:03 PM IST
Highlights

కేటీఆర్ రిసెప్షన్ కి వచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ.. కశ్యప్ ఈ రోజు ట్వీట్ చేశారు. అయితే.. ఆ ట్వీట్ లో  సీక్రెట్ స్టోరీ గురించి కూడా ప్రస్తావించారు.
 

భారత స్టార్ షట్లర్లు.. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు.. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 14న సింపుల్ గా రాయదుర్గంలోని సైనా నివాసం ‘ఒరియన్ విల్లా’ లో వీరిద్దరూ సింపుల్ గా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని నోవాటెల్ లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా రిసెప్షన్ చేసుకున్నారు.

ఈ రిసెప్షన్ సైనా, కశ్యప్ జంట స్వయంగా వెళ్లి మరీ... కేటీఆర్ ని పెళ్లికి ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించి.. కేటీఆర్ కూడా రిసెప్షన్ కి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు.  కేటీఆర్ రిసెప్షన్ కి వచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ.. కశ్యప్ ఈ రోజు ట్వీట్ చేశారు. అయితే.. ఆ ట్వీట్ లో  సీక్రెట్ స్టోరీ గురించి కూడా ప్రస్తావించారు.

‘‘మీ ఆశీస్సులు అందించినందుకు ధన్యవాదాలు సర్. మా సీక్రెట్ స్టోరీ మీతోనే సేఫ్‌గా ఉండాలి.’’ అంటూ కేటీఆర్‌తో తమ దంపతులు ఉన్న ఫొటోను కశ్యప్ ట్వీట్ చేశారు. దీంతో.. ఆ సీక్రెట్ స్టోరీ ఏంటా..? అని నెటిజన్లు ట్వీట్ల రూపంలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరేమో.. సైనా, కశ్యప్ ల లవ్ స్టోరీ అయ్యి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తాన్ని కశ్యప్ ట్వీట్ మాత్రం వైరల్ గా మారింది. 

Thank you sir for your blessings . Our secret story is safe with you sir . 😁 pic.twitter.com/xrtxLYCL4w

— Parupalli Kashyap (@parupallik)

 

click me!