ఇండోనేషియా ఓపెన్ ఫైనల్‌లో సింధు ఓటమి

By Siva KodatiFirst Published Jul 21, 2019, 2:55 PM IST
Highlights

ఇండోనేషియా ఓపెన్ ఫైనల్‌లో తెలుగు తేజం పీవీసింధు పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో జపాన్‌ క్రీడాకారిణి యమగుచి చేతితో 15-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలైంది.

ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి చేతిలో 19-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలయ్యింది.

క్వార్టర్స్, సెమీస్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన సింధు ఫైనల్లో తన మ్యాజిక్ చూపించలేకపోయింది. తొలి సెట్లో గట్టిపోటినిచ్చినప్పటికీ.. తర్వాత యమగూచి ధాటికి సింధు తలవంచక తప్పలేదు. అయితే గతంలో యమగూచిపై సింధుకి మెరుగైన రికార్డు ఉంది. 

click me!