మిస్ యూనివర్స్ సింగపూర్ గా తెలుగమ్మాయి..!

By telugu news teamFirst Published Sep 18, 2021, 10:57 AM IST
Highlights

నేషనల్ మ్యూజియం సింగపూర్‌లో మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 పోటీలు జరిగాయి. ఈ పోటిలో నందిత బన్న ఏడుగురు ఫైనలిస్టులతో పోటీ పడి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
 

మిస్ యూనివర్స్ సింగపూర్-2021 కిరీటం తెలుగమ్మాయికి దక్కింది. తెలుగు రాష్ట్రానికి చెందిన నందిత అనే అమ్మయిని ఈ కిరీటం వరించింది. కొద్ది సేపటి క్రితం నిర్వాహకులు ఫలితాలు వెల్లడించారు. 25ఏళ్ల క్రితం నందిత కుటుంబం సింగపూర్ లో స్థిరపడింది. ప్రస్తుతం ఆమె సింగపూర్ లోని లాసల్లా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో డబుల్ మనేజ్మెంట్ డిగ్రీ చేస్తున్నారు.  నిందిత తల్లిదండ్రులు గోవర్థన్, మాధురీల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కావడం గమనార్హం.

శుక్రవారం.. నేషనల్ మ్యూజియం సింగపూర్‌లో మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 పోటీలు జరిగాయి. ఈ పోటిలో నందిత బన్న ఏడుగురు ఫైనలిస్టులతో పోటీ పడి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

 

ప్రస్తుతం నందిత వయస్సు 21 సంవత్సరాలు. మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 గా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన నందిత బన్న ప్రస్తుతం సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో డిగ్రీ ఫైనలియర్‌ చేస్తుంది. కాగా.. నందిత బన్న డిసెంబర్ లో ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగే మిస్ యూనివర్స్ 2021 పోటిల్లో సింగపూర్‌ నుంచి ప్రాతినిధ్యం వహించనుంది.
 

click me!