అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థి అనుమానాస్పదమృతి.. వారంలో మూడో ఘటన...

By SumaBala BukkaFirst Published Feb 2, 2024, 11:30 AM IST
Highlights

న్యూయార్క్‌లోని ఇండియన్ మిషన్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది.శ్రేయాస్ రెడ్డి మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

న్యూఢిల్లీ : అమెరికాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి మృతి చెందాడు. ఇది ఈ ఏడాది నాలుగో ఘటన, ఈ వారంలో మూడో ఘటన. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. 19 ఏళ్ల శ్రేయాస్ రెడ్డి బెనిగర్ ఒహియోలోని లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో విద్యార్థి. శ్రేయాస్ తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్నారని, అయితే అతని వద్ద అమెరికా పాస్‌పోర్ట్ ఉందని అధికారులు మీడియాకు తెలిపారు.

ఈ కేసులో ఏదైనా ఫౌల్ ప్లే లేదా ద్వేషపూరిత నేరం జరిగే అవకాశం లేదని అధికారులు తోసిపుచ్చారు. దీనిమీద న్యూయార్క్‌లోని ఇండియన్ మిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. శ్రేయాస్ మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

"ఓహియోలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెనిగేరి దురదృష్టవశాత్తూ మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసు విచారణ కొనసాగుతోంది. ఈ దశలో, ఫౌల్ ప్లే అనుమానించబడలేదు. కాన్సులేట్ కుటుంబంతో సన్నిహితంగా ఉండి కావాల్సిన సహయాసహకారాలు అందిస్తోంది. వారికి అన్ని విధాలుగా సహాయం చేయండి" అని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ X లో పోస్ట్ చేసింది.

రంగారెడ్డి జిల్లా రైతు అదృష్టం:లక్కీ డ్రాలో కిలో బంగారం

ఈ వారం ప్రారంభంలో పర్డ్యూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి , నీల్ ఆచార్య శవమై కనిపించాడు. ఆచార్య అదృశ్యమైనట్లు అతని తల్లి ఆదివారం ఫిర్యాదు చేసింది. కొన్ని గంటల తర్వాత, యూనివర్సిటీ క్యాంపస్‌లో ఒక మృతదేహం వెలుగు చూసింది. అది నీల్ ఆచార్యగా గుర్తించారు. అంతకు ముందు నీల్ ఆచార్య కనిపించడం లేదని.. అతని తల్లి గౌరీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ చేసింది. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే తెలపాలని కోరింది. ఆ తరువాత ఆమెకు నీల్ ను చివరిసారిగా ఉబెర్ డ్రైవర్ చూశాడని, క్యాంపస్ దగ్గర వదిలేసినట్టు తేలింది. 

మరో కేసులో, హర్యానాలోని పంచకుల నివాసి అయిన వివేక్ సైనీని జనవరి 16న జార్జియాలోని లిథోనియాలో ఓ వ్యక్తి వ్యక్తి కొట్టి చంపాడు. జార్జియాలోని లిథోనియాలో ఎంబీఏ డిగ్రీ చేస్తున్న వివేక్ సైనీ, ఓ కన్వీనియన్స్ స్టోర్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేశాడు. సైనీ మీద దాడి చేసిన వ్యక్తి నిరాశ్రయుడు. అతనికి సైనీ అప్పుడప్పుడు చిప్స్, నీరు, జాకెట్ కూడా ఇచ్చినట్లు నివేదించబడింది. 

జనవరి 16న, 25 ఏళ్ల సైనీ.. అతనికి ఉచిత ఆహారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో నిందితుడు సైనీ మీద దాడి చేసి, 50 సార్లు కొట్టాడని పోలీసులు తెలిపారు. మరో భారతీయ విద్యార్థి అకుల్ ధావన్ జనవరిలో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్  వెలుపల శవమై కనిపించాడు.

18 ఏళ్ల యువకుడి శవపరీక్షలో అతను అల్పోష్ణస్థితితో మరణించాడని సూచించింది.అయితే, అకుల్ ధావన్ కనిపించకుండా పోయిన తర్వాత యూనివర్సిటీ పోలీసు విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ధావన్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

అమెరికాలో 300,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. గత రెండు సంవత్సరాలలో, కోవిడ్ తర్వాత 200,000 మంది విద్యార్థులకు అమెరికా వీసాలు జారీ చేయబడ్డాయి. మానసిక ఒత్తిడి, ఒంటరితనం, మాదకద్రవ్య దుర్వినియోగానికి గురికావడం చాలా సందర్భాలలో ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

click me!