రెండు ట్రైనీ విమానాలు ఢీ.. భారతీయ యువతి సహా ముగ్గురు మృతి

Published : Jul 18, 2018, 02:53 PM IST
రెండు ట్రైనీ విమానాలు ఢీ.. భారతీయ యువతి సహా ముగ్గురు మృతి

సారాంశం

మియామి సమీపంలో శిక్షణకు ఉపయోగించే రెండు చిన్న విమానాలు అనుకోకుండా ఒకదానిని మరొకటి ఢొకొన్నాయి. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

రెండు ట్రైనీ విమానాలు ఢీకొని ఒక భారతీయ యువతి సహా.. ముగ్గురు మృతి చెందిన సంఘటన వాషింగ్టన్ లో చోటుచేసుకుంది. మియామి సమీపంలో శిక్షణకు ఉపయోగించే రెండు చిన్న విమానాలు అనుకోకుండా ఒకదానిని మరొకటి ఢొకొన్నాయి. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

ఈ రెండు విమానాలు మియామిలోని డీన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్కూలుకి చెందినవిగా గుర్తించారు. ఈ స్కూల్ కి చెందిన విమానాలు కేవలం 10ఏళ్లలో రెండు డజన్లకు పైగా ప్రమాదానికి గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. 

మృతులు నిషా సెజ్వాల్(19 సంవత్సరాలు, ఇండియా), జార్గే షాంచెజ్(22), రాల్ఫ్ నైట్(72) గా గుర్తించారు.  నిషా.. 2017లో ఈ ఫ్లైట్ స్కూల్ లో శిక్షణ నిమిత్తం చేరింది. ఆమె ఫేస్ బుక్ ఆధారంగా ఈ విషయాలు తెలుసుకున్నట్లు వారు తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..