రెండో రోజే కనిపించుకుండా పోయిన భార్య.. మరో పెళ్లికి రెడీ.. పక్కా ప్లాన్‌తో వెలుగులోకి షాకింగ్ విషయాలు..

By Sumanth KanukulaFirst Published Sep 25, 2022, 11:50 AM IST
Highlights

పెళ్లి చేసుకున్న రెండు రోజులకే భార్య కనిపించకుండా పోవడంతో భర్త ఆందోళన చెందాడు. ఆమె కోసం పలుచోట్ల గాలింపు చేపట్టాడు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. 

పెళ్లి చేసుకున్న రెండు రోజులకే భార్య కనిపించకుండా పోవడంతో భర్త ఆందోళన చెందాడు. ఆమె కోసం పలుచోట్ల గాలింపు చేపట్టాడు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. అయితే చివరకు ఆమె అసలు బండారం బయటపడింది. ఆమె మరో వ్యక్తితో పెళ్లికి సిద్దమవుతుండగా అతడు ప్లాన్ చేసి పట్టుకున్నాడు. అయితే ఆమె అప్పటికే ఆరు పెళ్లిళ్లు చేసుకున్నట్టుగా తేలింది. అయితే నిత్య పెళ్లి కూతురును రెడ్ హ్యాండెడ్‌గా ఎలా దొరికిపోయిందో తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే.. 

తమిళనాడులోని నమక్కల్ జిల్లా పరమతి వేలూరు సమీపంలోని కల్లిపాళయానికి చెందిన 35 ఏళ్ల ధనబాల్‌కు మధురైకి చెందిన సంతియాతో సెప్టెంబర్ 7వ తేదీన వివాహం జరిగింది. పుదువెంకరై అమ్మన్ ఆలయంలో చాలా సింపుల్‌గా పెళ్లి జరిగింది. వధువు సంతియా తరఫున.. ఆమె సోదరి, సోదరి భర్తగా చెప్పుకున్న ఇద్దరితో పాటు, మధురైకి చెందిన మ్యాచ్ మేకర్ బాలమురుగన్ మాత్రమే హాజరయ్యారు. వివాహం అనంతరం మ్యాచ్ మేకర్ 1.5 లక్షల కమిషన్ తీసుకుని వెళ్లిపోయారు. అయితే పెళ్లి జరిగిన రెండోవ రోజులు ఉదయం లేచి చూసేసరికి సంధ్య కనిపించలేదు. దీంతో సంతియా ఆచూకీ కోసం ధనబాల్ పలుచోట్ల గాలింపు చేపట్టారు. 

ఆమెతో పాటు వివాహానికి హాజరైనవారికి ఫోన్‌లు చేయగా స్విచ్ఛాఫ్ అని  వచ్చింది. మరోవైపు ఇంట్లో ఉన్న పెళ్లి పట్టువస్త్రాలు, నగలు కనిపించుకుండా పోయాయి. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ధనబాల్.. ఈ విషయమై పరమత్తి వేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంతలో అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి పెళ్లికి వధువు కోసం వెతుకుతుండగా మ్యాచ్ మేకర్ ధనలక్ష్మి ద్వారా సంతియా ఫొటో వచ్చింది. అయితే ఈ విషయం ధనబాల్‌కు తెలిసింది. ఈ క్రమంలోనే సంతియాను రెడ్ హ్యాండె‌డ్ పట్టుకునేందుకు ధన‌బాల్ ప్లాన్ చేశాడు. ఇక, సంతియా చరిత్ర గురించి తెలుసుకున్న ఆ వ్యక్తి పెళ్లికి ఇష్టమని మ్యాచ్ మేకర్ ధనలక్ష్మి ద్వారా సంతియాకు తెలియజేశారు. అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పెళ్లికి అంతా సిద్దమైంది. 

ఈ క్రమంలోనే పెళ్లి రోజు తిరుచెంగోడ్‌కు కారులో వచ్చిన సంధ్య, ఆమె ముగ్గురు సహచరులను ధనబాల్ కుటుంబీకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని విచారించారు. ఇందులో పలు షాకింగ్ సమాచారం బయటికి వచ్చింది. మధురైకి చెందిన సంతియా ఇప్పటి వరకు ఆరు పెళ్లిళ్లు చేసుకున్నట్టుగా తేలింది. పెళ్లి జరిగిన తర్వాత సంధ్య వారి ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకుని పారిపోయేదని వెల్లడైంది. సంధ్య పెళ్లిళ్లకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

click me!