attack on owaisi:జెడ్ కేటగిరీ కల్పించిన ప్రభుత్వం.. జెడ్ సెక్యూరిటీ అంటే ఏంటో తెలుసా..

Ashok Kumar   | Asianet News
Published : Feb 05, 2022, 02:07 AM IST
attack on owaisi:జెడ్ కేటగిరీ కల్పించిన ప్రభుత్వం.. జెడ్ సెక్యూరిటీ అంటే ఏంటో తెలుసా..

సారాంశం

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పుల ఘటన నేపథ్యంలో ఆయనకు 'జెడ్' కేటగిరీ భద్రత కల్పించారు. అయితే దేశంలోని ప్రముఖులు, చాలా ప్రత్యేక వ్యక్తుల భద్రతకు ముప్పు స్థాయిని పరిగణనలోకి తీసుకుని వారికి వివిధ రకాల భద్రతలు అందించబడతాయి. 

తాజాగా ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై దాడి జరిగిన సంగతి మీకు తెలిసిందే. ఈ దాడి తర్వాత మరోసారి భద్రత అంశం చర్చనీయాంశంగా మారింది. ఏ‌ఐ‌ఎం‌ఐ‌ఎం చీఫ్ అండ్ లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపిన ఒక రోజు తర్వాత, ప్రభుత్వం అతనికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కమాండోలచే 'జెడ్ కేటగిరీ' భద్రతను కల్పించింది.

 దేశంలోని ప్రముఖులకు, వి‌ఐ‌పిలకు వారి ప్రాణాలకు ఇంకా వారి భద్రతకు ముప్పు స్థాయిని దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల భద్రతలు అందించబడతాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సలహా మేరకు ప్రతి సంవత్సరం ముఖ్యమైన వ్యక్తుల భద్రతను సమీక్షిస్తుంది. వీవీఐపీలు, వీఐపీలకు ముప్పు స్థాయిని బట్టి వివిధ స్థాయిల భద్రతను కల్పిస్తారు. 

ఏ నాయకులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక రంగంలోని ముఖ్యులకు ఎలాంటి భద్రత కల్పించాలో నిర్ణయించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దీని కోసం భద్రతా వ్యవస్థను వివిధ వర్గాలుగా వర్గీకరించారు. వీటిలో ఎస్‌పి‌జి ప్రొటెక్షన్, జెడ్ ప్లస్, జెడ్, వై ఇంకా ఎక్స్ క్యాటగిరి మొదలైనవి ఉన్నాయి.

జెడ్ కేటగిరీలో ఎన్‌ఎస్‌జి కమాండోలతో సహా 22 మంది 
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఇస్తున్న జెడ్ కేటగిరీ భద్రతలో నలుగురు నుంచి ఐదుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలతో సహా మొత్తం 22 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఇందులో ఢిల్లీ పోలీసులు, ఐ‌టి‌బి‌పి లేదా సి‌ఆర్‌పి‌ఎఫ్ ఇంకా స్థానిక పోలీసుల కమాండోలు కూడా ఉంటారు. 

ఏ కేటగిరీలో ప్రత్యేకత ఏంటంటే 

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సెక్యూరిటీ (SPG)
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) భద్రత దేశంలో అత్యున్నత తరగతి భద్రతా వ్యవస్థ. ఈ భద్రత ప్రధానమంత్రికి మాత్రమే ఉంటుంది. అయితే, ప్రధాని పదవి నుంచి తొలగిన తర్వాత కూడా ఆరు నెలల పాటు ఈ భద్రతను కల్పిస్తారు. ఎస్‌పి‌జి సెక్యూరిటీ స్క్వాడ్‌లో దేశంలోని అత్యంత సాహసోపేతమైన కమాండోలు ఉంటారు. 2 జూన్ 1988న పార్లమెంటు చట్టం ద్వారా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న జవాన్లు బి‌ఎస్‌ఎఫ్, సి‌ఐ‌ఎస్‌ఎఫ్, ఐ‌టి‌బి‌పి, సి‌ఆర్‌పి‌ఎఫ్ వంటి పోలీసు, పారామిలటరీ బలగాలకు చెందిన అత్యుత్తమ కమాండోల నుండి ఎంపిక చేయబడతారు. 

జెడ్ ప్లస్ భద్రత 
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రొటెక్షన్ తర్వాత జెడ్  ప్లస్ భద్రత దేశంలో రెండవ అత్యధిక భద్రతా వర్గం. ఈ రక్షణ అధిక ముప్పు ఉన్న  వి‌వి‌ఐ‌పిలకు ఇవ్వబడుతుంది. ఈ కేటగిరీకి చెందిన సెక్యూరిటీ స్క్వాడ్‌లో 36 మంది జవాన్లు ఉంటారు. వీరిలో 10 మందికి పైగా ఎన్‌ఎస్‌జి కమాండోలు,  వీరితో పాటు ఐటీబీపీ, సి‌ఆర్ఎఫ్, ఢిల్లీ పోలీసులు, రాష్ట్ర పోలీసు సిబ్బందికి చెందిన కమాండోలు పాల్గొంటున్నారు. ప్రతి కమాండో యుద్ధ కళలు, ఆయుధాలు లేని పోరాటంలో నిపుణుడు. ఎన్‌ఎస్‌జి కమాండోలు మెషిన్ గన్‌లతో కూడిన ఆధునిక కమ్యూనికేషన్ డివైజెస్ కలిగి ఉంటారు. దీనితో పాటు మొబైల్ సిగ్నల్‌ను జామ్ చేసే జామర్ వాహనం కూడా కాన్వాయ్‌లో ఉంటుంది. 
 
వై క్లాస్ భద్రత
దేశంలో వై క్లాస్ అనేది మూడో స్థాయి భద్రత. దీనిని వీఐపీ కేటగిరీ వ్యక్తులకు ఇవ్వబడుతుంది. ఈ కేటగిరీ భద్రతలో మొత్తం 11 మంది జవాన్లు ఉంటారు. వీరిలో ఇద్దరు పీఎస్‌ఓలు (priavte security guards), ఒకరిద్దరు కమాండోలను నియమిస్తారు.  
 
ఎక్స్ క్లాస్ భద్రత
అదే సమయంలో ఎక్స్ క్లాస్ భద్రత కేటగిరీలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పోస్ట్ చేస్తారు. ఇందులో పి‌ఎస్‌ఓ (personal security officer) ఉంటారు. దేశంలో చాలా మందికి ఎక్స్ క్లాస్ సెక్యూరిటీ ఉంది. ఈ భద్రతలో కమాండోలు ఎవరూ ఉండరు. ప్రాథమిక స్థాయిలో ముప్పును దృష్టిలో ఉంచుకుని ఎక్స్ క్లాస్ భద్రత ఇవ్వబడుతుంది. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu