Weather Forecast : ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. తుఫానుగా మారనున్న అల్పపీడనం..

Published : May 07, 2022, 09:57 AM IST
Weather Forecast : ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. తుఫానుగా మారనున్న అల్పపీడనం..

సారాంశం

రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లకు చేరుకోనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

న్యూఢిల్లీ : దక్షిణ అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం (మే 7, 2022) సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆదివారం సాయంత్రానికి అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని IMD అధికారులు తెలిపారు.

ఆ తర్వాత, ఇది వాయువ్య దిశగా పయనించి, మే 10న ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు ఆనుకుని పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలోని వాయువ్య బంగాళాఖాతంకి చేరుకుంటుందని IMD తెలిపింది. అదనంగా, అండమాన్ సముద్రం, అండమాన్ & నికోబార్ దీవుల మీదుగా 40-50 kmph నుండి 60 kmph వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 

మే 7 నుండి వాయువ్య భారత్ లో, మే 8 నుండి మధ్య భారత్ లో వేడి గాలులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. మే 7 నుండి మే 9 వరకు రాజస్థాన్‌లో, మే 8, మే 9 తేదీలలో దక్షిణ హర్యానా, ఢిల్లీ, నైరుతి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాలలో హీట్‌వేవ్ పరిస్థితులు అంచనా వేయబడ్డాయి.

తుఫానుగా మార్పు
శుక్రవారం దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడి వచ్చే వారం ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని, దీనివల్ల తూర్పు కోస్తా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD శుక్రవారం తెలిపింది.

అల్పపీడనం వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. మే 10న తీరం చేరే అవకాశం ఉందని తెలిపారు.

ఢిల్లీలో  పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 
ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉండడం, బలమైన గాలులు, తేలికపాటి వర్షం వల్ల శుక్రవారం ఉష్ణోగ్రతలు కాస్త  అదుపులో ఉన్నాయి. అయితే, దేశ రాజధానిలో వచ్చే వారం నుండి ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ మార్కుకు పెరగడంతో పాటు హీట్‌వేవ్‌లలో మరింత పెరుగుదల కనిపిస్తుందని IMD అంచనా వేసింది.

సోమవారం నుండి కొత్తగా వడగాలు ఉదృతి ప్రారంభమవుతుందని, మంగళవారం పాదరసం 44 డిగ్రీల సెల్సియస్ మార్కును తాకవచ్చని IMD తెలిపింది. కాగా, శుక్రవారం ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైంది. అరేబియా సముద్రం లేదా బంగాళాఖాతం నుండి వచ్చే గాలులు కొంత తేమను మోసుకొచ్చాయి. దీనివల్ల మేఘాలు ఏర్పడి, వర్షం కురిసింది" అని IMD శాస్త్రవేత్త చరణ్ సింగ్ అన్నారు.

తెలంగాణలో తేలికపాటి వర్షాలు
రానున్న 3-4 రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. కొన్ని జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్‌ పెరిగే అవకాశం ఉంది.

అండమాన్ & నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు
మే 7న అండమాన్ & నికోబార్ దీవుల మీదుగా వివిక్త ప్రదేశాలలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్