వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకు ఎక్కిన 21 పార్టీలు

By narsimha lodeFirst Published Apr 24, 2019, 2:33 PM IST
Highlights

50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతూ 21 రాజకీయా పార్టీలు  సుప్రీంకోర్టులో బుధవారం నాడు  రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి.
 


న్యూఢిల్లీ: 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతూ 21 రాజకీయా పార్టీలు  సుప్రీంకోర్టులో బుధవారం నాడు  రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి.

ఈ నెల మొదటి వారంలో 5 ఈవీఎంలలోని వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని  సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 5 ఈవీఎంలకు బదులుగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో  కనీసం 50 శాతం ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని  21 రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.  ఈ మేరకు ఈ పార్టీలు ఇవాళ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి.

5 ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పులను  లెక్కించాలని  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై  రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇడివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఏపీలో ఎన్నికలు ముగిసిన వెంటనే చంద్రబాబునాయుడు ఈ విషయమై ఢిల్లీలో పలు రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం మేరకు ఇవాళ సుప్రీంకోర్టులో 21పార్టీల తరపున  రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

click me!
Last Updated Apr 24, 2019, 2:33 PM IST
click me!