న్యూడిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ ను ప్రగతిపథంలో నడిపడంలో ఆర్థిక వ్యవస్థ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే ఏ విభాగానికి ఎన్ని డబ్బులుఎలా ఖర్చుచేయాలని నిర్ణయించడం చాలా అవసరం. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది బడ్జెట్ ను కేటాయింపులను ఓ శాస్త్రీయ పద్దతిలో చేపడుతుంటారు. ఇలా ఈ ఏడాది 2022-23 వార్షిక బడ్జెట్ ను దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(మంగళవారం) ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11గంటలకు పార్లమెంట్ లో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు.

12:42 PM (IST) Feb 01
2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నర పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం సాగింది. అనంతరం స్పీకర్ ఓంబిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు.
12:41 PM (IST) Feb 01
12:34 PM (IST) Feb 01
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా .. వారికి కూడా ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్) డిడక్షన్ వుంటుందని ఆమె తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఎన్పీఎస్ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్మల చెప్పారు.
12:31 PM (IST) Feb 01
2022-23 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39 లక్షల కోట్లని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్లో ద్రవ్యలోటు 6.9 శాతం కాగా.. 2025-26 నాటికి 4.5 శాతానికి తగ్గించడం తమ లక్ష్యమని ఆమె చెప్పారు.
12:25 PM (IST) Feb 01
12:21 PM (IST) Feb 01
కోవిడ్ మహమ్మారి కారణంగా ఆదాయం కోల్పోయి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు వడ్డీ లేని అప్పులు ఇస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇస్తామని తెలిపారు.
12:17 PM (IST) Feb 01
త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ పాస్పోర్ట్ విధానం అందుబాటులోకి తెస్తామన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
12:15 PM (IST) Feb 01
యానిమేషన్ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రత్యేక ఆర్ధిక మండళ్ల చట్టం స్థానంలో నూతన చట్టం తీసుకొస్తామని ఆమె తెలిపారు.
12:13 PM (IST) Feb 01
ఈ ఏడాది డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి చెందుతుందని ఆమె చెప్పారు. బ్లాక్ చెయిన్ సాంకేతికతతో ఆర్బీఐ ఇందుకోసం రూపకల్పన చేస్తున్నట్లు నిర్మల తెలిపారు.
12:09 PM (IST) Feb 01
‘భారత్ నెట్ ప్రాజెక్ట్’లో భాగంగా పీపీపీ పద్ధతిలో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ ఆప్టికల్ ఫైబర్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ ప్రాజెక్టు 2025 నాటికి పూర్తవుతుందని ఆమె చెప్పారు. 5జీ ద్వారా ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు ఇంకా పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు.
12:04 PM (IST) Feb 01
కొత్తగా నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ రూపొందిస్తున్నామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సౌకర్యాలు, యునీక్ హెల్త్ ఐడెంటిటీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో ఉంచుతామని ఆర్ధిక మంత్రి తెలిపారు
12:03 PM (IST) Feb 01
2022-23 ఆర్ధిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులో తీసుకొస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణకు డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తామని.. విద్యుత్ వాహనాల పెంపులో భాగంగా బ్యాటరీల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని ఆర్ధిక మంత్రి చెప్పారు.
12:01 PM (IST) Feb 01
దేశవ్యాప్తంగా భూ సంస్కరణల్లో భాగంగా వన్ నేషన్- వన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెడతామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం తీసుకొస్తామని చెప్పారు.
11:57 AM (IST) Feb 01
నేషనల్ డిజిటల్ హెల్త్ సిస్టం కోసం ఓ ఫ్లాట్ఫాం రూపొందిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో 23 టెలీ మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నెట్వర్క్ను కలిగి ఉంటుందని ఆమె చెప్పారు. దీనికి నిమ్హాన్స్ నోడల్ సెంటర్గా, ట్రిపుల్ ఐటీ బెంగళూరు టెక్నికల్ సపోర్ట్ అందిస్తుందని నిర్మల తెలిపారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) మార్చి 2023 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.
11:54 AM (IST) Feb 01
కోవిడ్ మహమ్మారి కారణంగా దేశంలో అన్ని వయసుల వారు మానసిక అనారోగ్యానికి గురవుతున్నారని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వాళ్ల కోసం నాణ్యమైన మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్, సంరక్షణ సేవల కోసం నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నట్లు నిర్మల చెప్పారు
11:51 AM (IST) Feb 01
వ్యవసాయ వర్సిటీల సిలబస్లో మార్పులు చేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీరో బడ్జెట్ ఫార్మింగ్, సేంద్రియ సాగుకు ప్రోత్సాహకాలు కల్పిస్తామని ఆమె చెప్పారు.
11:49 AM (IST) Feb 01
దేశంలో కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.1500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
11:48 AM (IST) Feb 01
దేశవ్యాప్తంగా వున్న పోస్టాఫిస్లను కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశం నలుమూలకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తామని.. 5 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఆర్ధిక మంత్రి తెలిపారు.
11:45 AM (IST) Feb 01
కరోనా నేపథ్యంలో విద్యారంగంపై దృష్టి సారించామని.. పీఎం ఈ - విద్య ప్రోగ్రాం కింద వన్ క్లాస్ - వన్ టీవీ ఛానెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతమున్న 12 ఛానెళ్ల నుంచి 200 ఛానెళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠాలను వాటిలో బోధిస్తామని నిర్మల చెప్పారు. ఇంటర్నెట్ , టీవీ ఛానెళ్లు, రేడియోల ద్వారా విద్యార్థులకు డిజిటల్ టీచర్ల ద్వారా హై క్వాలిటీ డిజిటల్ టీచింగ్ కంటెంట్ను చేరుస్తామని ఆర్ధిక మంత్రి తెలిపారు.
11:42 AM (IST) Feb 01
ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకానికి కొత్తగా పోర్టల్ ప్రారంభిస్తామని ఆర్ధిక మంత్రి తెలిపారు. రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం అందుబాటులోకి తెస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో యువత, మహిళల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తామని.. పీఎం ఆవాస్ యోజన పథకం కింద 80 లక్షల గృహాలను నిర్మిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
11:39 AM (IST) Feb 01
కొత్తగా మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, మిషన్ అంగద్ పథకాలను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే ఇంటింటికీ మంచినీటి సరఫరా పథకం విస్తరిస్తామని... చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారెంటీ పథకం అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.2 లక్షల కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
11:36 AM (IST) Feb 01
1,208 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. తొలి దశలో గంగా నది వెంట 5 కిలో మీటర్ల పరిధిలో గల రైతుల భూములపై దృష్టి సారించి కెమికల్ ఫ్రీ వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తాం. 2021-22 రబీ సీజన్లో గోధుమలు, 2021-22 ఖరీఫ్ సీజన్ లో వరి ధాన్య సేకరణ అంచనా ప్రకారం 163 లక్షల మంది రైతుల నుంచి 1,208 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, వరిని కొంటామని నిర్మల తెలిపారు. రూ. 2.37 లక్షల కోట్లు రైతులకు చెల్లిస్తామని చెప్పారు.
11:33 AM (IST) Feb 01
కోవిడ్ పరిస్ధితుల నేపథ్యంలో విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనిలో భాగంగా దేశంలో కొత్తగా డిజిటల్ యూనివర్సిటీని స్థాపించనున్నట్లు నిర్మల వెల్లడించారు. పీఎం విద్యలో భాగంగా 200 టీవీ ఛానెళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
11:31 AM (IST) Feb 01
వ్యవసాయ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహిస్తామని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందుకోసం కోసం నాబార్డు నుంచి నిధులు మంజూరు చేస్తామని ఆమె చెప్పారు.
11:27 AM (IST) Feb 01
నదుల అనుసంధానానికి బడ్జెట్లో ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు నిర్మల చెప్పారు. కొన్ని నదుల అనుసంధానం కోసం డీపీఆర్లు సిద్ధమయ్యాయని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. దమన్ గంగా - పిర్ పంజాల్, పర్ తాపీ - నర్మదా, గోదావరి - క్రిష్ణా, కృష్ణా - పెన్నా, పెన్నా - కావేరీ నదులను ఇందుకోసం ఎంపిక చేశామని నిర్మల చెప్పారు. దీనివల్ల లబ్ధిపొందే రాష్ట్రాల నుంచి అంగీకారం అందగానే ఈ నదుల అనుసంధానం కోసం కేంద్రం ప్రయత్నాలు ప్రారంభిస్తుందని సీతారామన్ తెలిపారు.
11:25 AM (IST) Feb 01
వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లు ప్రవేశపెడతామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరో 100 పీఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్ వచ్చే 3 సంవత్సరాలలో అభివృద్ధి చేస్తామని నిర్మల పేర్కొన్నారు. మెట్రో రైల్వే స్టేషన్లను నిర్మించడానికి వినూత్న మార్గాలను అమలు చేస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
11:21 AM (IST) Feb 01
వ్యవసాయానికి సాంకేతిక హంగులు అద్దుతామని నిర్మలా సీతారామన్ తెలిపారు. డ్రోన్ల సాయంతో పంట పొలాల పరీక్షలు చేపడతామన్నారు.
11:19 AM (IST) Feb 01
ఈ బడ్జెట్ వచ్చే 25 ఏళ్ల కాలానికి బ్లూప్రింట్ లాంటిదని నిర్మలా సీతారామన్ అన్నారు. ఎయిర్ ఇండియాను టాటాకు విక్రయించే ప్రక్రియ పూర్తయిందని ఆమె పేర్కొన్నారు. అలాగే ఈ వ్యూహాత్మక ప్రైవేటీకరణ పథకంలో భాగంగా నీలాంచల్ ఇస్పాత్ లిమిటెడ్ ప్రైవేటు పరం చేశాం. ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియ త్వరలోనే జరుగుతుందని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. మరో రెండు ప్రభుత్వ సంస్థల విక్రయం ప్రాసెస్లో ఉందని నిర్మల తెలిపారు
11:17 AM (IST) Feb 01
దేశంలో కొత్తగా 4 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను నెలకొల్పుతున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. పర్వత ప్రాంతాల్ని కలిపేలా పీపీపీ మోడల్లో పర్వత్ మాలా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.
11:15 AM (IST) Feb 01
ఆత్మనిర్బర్ భారత్ స్పూర్తితో 16 లక్షల ఉద్యోగాలు సృష్టించామని, వేగంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేపడుతున్నట్లు నిర్మల పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె చెప్పారు. ఆర్ధిక వృద్ధి కొనసాగేలా బడ్జెట్ రూపకల్పన చేశామని.. ఈ బడ్జెట్లో నాలుగు ప్రధానాంశాలు వున్నాయని నిర్మల వెల్లడించారు. మొదటది పీఎం గతి శక్తి.. ఇందులో ఏడు రకాల అంశాలపై దృష్టి పెడతామని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. నేషనల్ హైవేస్ నెట్వర్క్ను 25 కి.మీకి పెంచుతామని.. ఇందుకు రూ.20 వేల కోట్లను సమీకరిస్తున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
11:09 AM (IST) Feb 01
కరోనా సంక్షోభ సమయంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. విద్యుత్, వంట గ్యాస్ ప్రతి ఇంటికి చేరేలా చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. పేద, మధ్య తరగతి సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని.. వచ్చే 25 ఏళ్ల పురోగతిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించామని ఆమె పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని.. వృద్ధిరేటు లక్ష్యం 9.2 శాతం అంచనా వుందన్నారు.
11:03 AM (IST) Feb 01
2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అంతకుముందు పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి.. ఈ మేరకు బడ్జెట్కు ఆమోద్రముద్ర వేసింది. కోవిడ్ 19 నేపథ్యంలో ఈసారి కూడా బడ్జెట్ ప్రసంగం కాగితరహితంగా వుండనుంది. దీనిలో భాగంగా నిర్మలా సీతారామన్ సంప్రదాయ బ్రీఫ్కేస్కు బదులు స్వదేశీ ట్యాబ్తో పార్లమెంట్కు చేరుకున్నారు. అయితే పరిమిత సంఖ్యలో ముద్రించిన బడ్జెట్ ప్రతులను ప్రభుత్వం పార్లమెంట్కు చేర్చింది
10:52 AM (IST) Feb 01
2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి.. ఈ మేరకు బడ్జెట్కు ఆమోద్రముద్ర వేసింది. అనంతరం ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రిగా వరుసగా నాలుగోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
10:41 AM (IST) Feb 01
పార్లమెంటు ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్కు మంత్రి మండలి ఆమోదం తెలుపనుంది. అనంతరం ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రిగా వరుసగా నాలుగోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
10:27 AM (IST) Feb 01
బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బడ్జెట్పై ఆశలు, ఆర్ధిక సర్వే నివేదిక ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలోపేతం చేస్తున్నాయి. దీంతో వరుసగా రెండో రోజు బుల్ జోరు కొనసాగుతోంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 735 పాయింట్లు ఎగబాకి 58,749 వద్ద, నిఫ్టీ 193 పాయింట్ల లాభంతో 17,533 వద్ద కొనసాగుతున్నాయి.
10:16 AM (IST) Feb 01
2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఈసారి కూడా బడ్జెట్ ప్రసంగం కాగితరహితంగా వుందనుంది. దీనిలో భాగంగా నిర్మలా సీతారామన్ సంప్రదాయ బ్రీఫ్కేస్కు బదులు స్వదేశీ ట్యాబ్తో పార్లమెంట్కు చేరుకున్నారు. అయితే పరిమిత సంఖ్యలో ముద్రించిన బడ్జెట్ ప్రతులను ప్రభుత్వం పార్లమెంట్కు చేర్చింది
10:08 AM (IST) Feb 01
2022-23 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్... బడ్జెట్ వివరాలను ఆయనకు తెలియజేశారు.
09:36 AM (IST) Feb 01
కేంద్ర ప్రభుత్వం ఇవాళ(మంగళవారం) దేశ బడ్జెట్ 2022-23 ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే సాంప్రదాయ పద్దతిలో కాకుండా టెక్నాలజీని ఉపయోగించి బడ్జెట్ ప్రసంగం చేయడానికి సిద్దపడ్డారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్థికశాఖ కార్యాలయానికి చేరుకున్న మంత్రి పలువురు ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. బడ్జెట్ కు ముందు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఆర్థిక మంత్రి మర్యాదపూర్వకంగా కలిసారు.
09:19 AM (IST) Feb 01
నాలుగోసారి దేశ బడ్జెట్ ను పార్లమెంట్ ను ప్రవేశపెట్టడానికి కేంధ్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్దమయ్యారు. 11గంటలకు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వుండగా ఇప్పటికే తన నివాసం నుండి ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు మంత్రి సీతారామన్. అక్కడి నుండి మరికొద్దిసేపట్లో బడ్జెట్ కు సంబంధించిన ఫైల్ తో ఆమె పార్లమెంట్ కు చేరుకోనున్నారు.
08:38 AM (IST) Feb 01
కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యంపైనే కాదు దేశ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలకు కాస్త ఊరటనిచ్చేలా బడ్జెట్ 2022-23లో ఆదాయపన్ను ఉపశమనాలు, ఇందనాలపై పన్నుల తగ్గింపు ప్రకటన వుండవచ్చని తెలుస్తోంది.