కాంచీపురం జిల్లాలోని ఆలయం వద్ద పేలుడు సంబవించింది.ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందారు.
కాంచీపురం: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా తిరుప్పోరూర్ సమీపంలోని మానామది ఆలయం వద్ద ఆదివారం జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని ఐబీ హెచ్చరించిన నేపథ్యంలోనే ఆదివారం నాడు ఈ ఆలయం వద్ద పేలుడు సంబవించడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది.
ఈ ఆలయ కొనులో పూడిక తీత పనుల సమయంలో పేలుడు చోటు చేసుకొంది. ఇదే గ్రామానికి చెందిన సూర్య అనే యువకుడు స్నేహితులతో కలిసి కొలను వద్దకు వెళ్లాడు. అక్కడ ఓ బాక్స్ లభించింది. దాన్ని ఆలయం వద్దకు తీసుకొచ్చి తెరిచారు. దాన్ని తెరవడంతో ఆ బాక్స్ పేలింది.
ఈ శబ్దంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడిన సూర్యతో పాటు మరో వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు. వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ పేలుడు దాటికి ఆలయం వద్ద గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. చెంగల్పట్టు, మహాబలిపురం డీఎస్పీలు బాంబ్ స్వ్కాడ్ లు రంగంలోకి దిగాయి.