బెయిల్ కావాలంటే సెషన్స్ కోర్టులో తేల్చుకోవాలి.. ఆర్నబ్ కి హైకోర్ట్ షాక్..

Bukka Sumabala   | Asianet News
Published : Nov 09, 2020, 03:52 PM IST
బెయిల్ కావాలంటే సెషన్స్ కోర్టులో తేల్చుకోవాలి.. ఆర్నబ్ కి హైకోర్ట్ షాక్..

సారాంశం

ఆర్నబ్ గోస్వామి మీద 2018లో నమోదైన కేసును తిరిగి ఓపెన్ చేయడానికి కావాల్సిన చట్టపరమైన అనుమతులు పోలీసులు తీసుకోలేదని ఆయన తరఫు న్యాయవాదులు హరీష్ సాల్వే, అబాద్ పోండా లు కోర్టులో వాదించారు.

ఆర్నబ్ గోస్వామి మీద 2018లో నమోదైన కేసును తిరిగి ఓపెన్ చేయడానికి కావాల్సిన చట్టపరమైన అనుమతులు పోలీసులు తీసుకోలేదని ఆయన తరఫు న్యాయవాదులు హరీష్ సాల్వే, అబాద్ పోండా లు కోర్టులో వాదించారు.

తన అరెస్ట్ విషయంలో, తనపై 2018లో పెట్టిన కేసును రీ ఓపెన్ చేయడం విషయాన్ని సవాల్ చేస్తూ ఆర్నబ్ పెట్టుకున్న పిటిషన్ ను బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మునుపటి విచారణలో బెయిల్ కావాలంటే సెషన్స్ కోర్టుకు వెళ్లవచ్చని బాంబే హైకోర్టు సూచించింది. ఈ మధ్యాహ్నం, గోస్వామి బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.

ఆర్నబ్ కేసులో బాంబే హైకోర్టు శనివారంనాడు.. ‘తాము ఈ రోజు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని, అయితే ఈ లోపు పిటిషన్ దారు తన పెండింగ్ బెయిల్ పిటిషన్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించకుండా నిరోధించలేమని తెలిపింది. అంతేకాదు అలాంటి పిటిషన్ దాఖలైతే దానిమీద నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకోబడుతుందని తెలిపింది. 

అరెస్టుకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే, అర్నాబ్ గోస్వామి జైలు నుండి బయటకు రాగలడు, లేకపోతే అతను సెషన్స్ కోర్టు నుండి బెయిల్ పొందవలసి ఉంటుంది. ఈ రెండింటిలో ఒకటి జరిగే వరకు అతను జైలులో ఉంటాడు.

2018 ఆత్మహత్య కేసులో తమకు కొత్త ఆధారాలు దొరికాయని పోలీసులు పేర్కొనడంతో అర్నాబ్ గోస్వామిని బుధవారం ముంబైలోని తన ఇంట్లో అరెస్ట్ చేశారు.  ఆర్నబ్ ను మొదట స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఉంచారు, అక్కడినుంచి ఆదివారం తలోజా జైలుకు తరలించారు.

అర్నబ్ అరెస్ట్ తరువాత పోలీసుల కస్టడీకి ఇవ్వలేదు. మేజిస్ట్రేట్ కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. దర్యాప్తు కోసం పోలీసు కస్టడీ అవసరమని పోలీసులు చెబుతున్నందున రాయ్ గఢ్ జిల్లాలోని సెషన్స్ కోర్టులో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాన్ని సవాలు చేశారు.

అర్నాబ్ గోస్వామి న్యాయవాదులు హరీష్ సాల్వే, అబాద్ పోండా వాదిస్తూ ఈ కేసును తిరిగి తెరిచే చట్టపరమైన అనుమతులు పోలీసులు కోర్టునుండి తీసుకోలేదని అన్నారు. అర్నబ్ అరెస్టు,  కేసు తిరిగి ప్రారంభించడం "చట్టవిరుద్ధం" అని వారు వాదిస్తున్నారు.

ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు కోరినందున రిపబ్లిక్ టివికి చెందిన అర్నాబ్ గోస్వామికి తన పోలీసు కస్టడీకి బదులుగా జ్యుడిషియల్ కస్టడీకి మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేయాలన్న పోలీసు పిటిషన్‌ను రాయ్‌గడ్‌లోని సెషన్స్ కోర్టు విచారిస్తోంది. మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను పున:పరిశీలించాలని పోలీసులు సెషన్స్ కోర్టును కోరారు.
 

PREV
click me!

Recommended Stories

Raghav Chadha Speaks in Parliament: పార్లమెటులో రాఘవ్ చద్దా | Asianet News Telugu
Monalisa Got Married: నాన్న నుంచే ప్రాణహాని పెళ్లి తర్వాత మీడియాతో మోనాలిసా| Asianet News Telugu