1998 నాటి తీర్పును సమీక్షిస్తాం..: సుప్రీం కోర్టు కీలక ప్రకటన

Published : Sep 21, 2023, 02:45 AM IST
1998 నాటి తీర్పును సమీక్షిస్తాం..: సుప్రీం కోర్టు కీలక ప్రకటన

సారాంశం

Supreme Court: సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 1998లో ఉన్నత న్యాయస్తానం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని నిర్ణయించింది. ఈ కేసును మళ్లీ విచారించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ఇంతకీ ఆ కేసేంటీ?  ఈ తీర్పేంటీ? 

Supreme Court: సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పీవీ నరసింహారావు కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇందుకోసం ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే సభలో ప్రసంగం చేయడానికి లేదా నిర్దిష్ట పద్ధతిలో ఓటు వేయడానికి లంచం తీసుకున్నందుకు ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపు పొందవచ్చా లేదా అనే విషయాన్ని బెంచ్ పరిశీలిస్తుంది.

  విచారణ జరుగుతుందా?

ఈ కేసును మళ్లీ విచారించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. వాస్తవానికి.. 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ముఖ్యమైన ప్రశ్నను ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి సూచించింది. ఇది విస్తృత ప్రభావాలను కలిగి ఉందని పేర్కొంది. ఇది ప్రజా ప్రాముఖ్యత కలిగిన ప్రశ్నఅని పేర్కొంది. 

ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఏం చెప్పింది?

జార్ఖండ్‌లోని జామా నియోజకవర్గానికి చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే సీతా సోరెన్ అప్పీల్‌పై సంచలనం సృష్టించిన జేఎంఎం లంచం కేసులో తీర్పును పునఃసమీక్షిస్తామని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

1998 నాటి నిర్ణయం ఏమిటి?

పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం, సభలో ఏదైనా ప్రసంగం చేసినా లేదా ఓటింగ్ చేసినా క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి ఎంపిలకు రాజ్యాంగం ప్రకారం మినహాయింపు ఉందని పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu