స్పీకర్‌తో సీఎం కుమారస్వామి భేటీ: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

Published : Jul 15, 2019, 01:17 PM IST
స్పీకర్‌తో సీఎం కుమారస్వామి భేటీ: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

సారాంశం

స్పీకర్‌ రమేష్‌కుమార్‌ను  కర్ణాటక సీఎం కుమారస్వామి సోమవారం నాడు కలిశారు.కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇవాళ బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  

బెంగుళూరు: స్పీకర్‌ రమేష్‌కుమార్‌ను  కర్ణాటక సీఎం కుమారస్వామి సోమవారం నాడు కలిశారు.కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇవాళ బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సమావేశం తర్వాత స్పీకర్ రమేష్‌కుమార్ ను సీఎం కుమారస్వామి కలిశారు. నాలుగు రోజుల క్రితం తాను విశ్వాస పరీక్షను ఎదుర్కొంటానని సీఎం కుమారస్వామి అసెంబ్లీలో ప్రకటించారు. అయితే విశ్వాస పరీక్షకు సమయం కావాలని కుమారస్వామి అడిగారు.

బలపరీక్షను ఇవాళే చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ తరుణంలో  స్పీకర్ రమేష్ కుమార్‌తో సీఎం కుమారస్వామి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటారోననేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

PREV
click me!

Recommended Stories

Petrol Price : ఇండియాకూ పాక్, శ్రీలంక పరిస్థితేనా..? పెట్రోల్, డీజిల్ ధరలు అంతలా పెరుగుతాయా..?
Haunted Railway Stations : భారత్‌లోని టాప్ 5 మిస్టరీ రైల్వే స్టేషన్లు.. కర్నూల్ స్టేషన్ దీ వింత కథే..!