శబరిమలలోకి మహిళలు.. ఆలయం మూసివేత

Published : Jan 02, 2019, 11:07 AM ISTUpdated : Jan 02, 2019, 11:09 AM IST
శబరిమలలోకి మహిళలు.. ఆలయం మూసివేత

సారాంశం

శబరిమల ఆలయాన్ని పూజారులు మరోసారి మూసివేశారు. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బిందు, కనకదుర్గ అనే ఇద్దరు 40ఏళ్లలోపు మహిళలు.. ఆలయంలోకి ప్రవేశంచిన సంగతి తెలిసిందే.

శబరిమల ఆలయాన్ని పూజారులు మరోసారి మూసివేశారు. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బిందు, కనకదుర్గ అనే ఇద్దరు 40ఏళ్లలోపు మహిళలు.. ఆలయంలోకి ప్రవేశంచిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత.. తొలిసారి ఈ ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.

ఈ ఇద్దరు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు పోలీసులు రక్షణగా నిలిచారు. కాగా.. దీనిపై పోలీసులపై భక్తులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. మహిళల ప్రవేశంతో ఆలయ అపవిత్రం అయ్యిందంటూ.. ఆలయాన్ని పూజారులు మూసివేశారు. సంప్రోక్షణ( ఆలయం శుద్ధి చేయడం) తర్వాత తిరిగి ఆలయాన్ని మళ్లీ తెరవనున్నారు. 

సంబంధిత వార్తలు..

శబరిమలలోకి ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశం (వీడియో)

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?