Pakistan crisis: లండ‌న్ లో పాక్ మాజీ ప్రధాని ఇంటి ముందు.. ఇమ్రాన్ మ‌ద్ద‌తుదారుల ఆందోళ‌న‌లు

Published : Apr 11, 2022, 01:54 AM ISTUpdated : Apr 11, 2022, 02:01 AM IST
Pakistan crisis: లండ‌న్ లో పాక్ మాజీ ప్రధాని ఇంటి ముందు..  ఇమ్రాన్ మ‌ద్ద‌తుదారుల ఆందోళ‌న‌లు

సారాంశం

Pakistan crisis: ప్రతిపక్షాలు ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అధికారం నుంచి దించేశాయ‌ని,  ఆయ‌న అనుచ‌రులు,  పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు ఆందోళ‌న‌లు చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో లండ‌న్ లోని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నివాసం ఎదుట పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు ఆందోళనకు దిగారు.   

Pakistan crisis: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్‌పై శనివారం అర్ధరాత్రి అవిశ్వాసంపై ఓటింగ్‌ జరిగింది.  జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉండగా, మెజార్టీకి అవసరమైన బలం 172. అయితే ఇమ్రాన్‌ సర్కార్‌ కు వ్యతిరేకంగా 174 ఓట్లు వచ్చినట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ ఆయాజ్‌ సాదిఖ్‌ ప్రకటించారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడయ్యాడు. దీంతో పాకిస్తాన్‌ చరిత్రలో అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన తొలి పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ నిలిచాడు. 

ఇదిలా ఉంటే.. ప్రతిపక్ష పార్టీలు ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అధికారం నుంచి దించేశాయ‌ని ఆయ‌న అనుచ‌రులు,  పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో  లండ‌న్ లోని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నివాసం ఎదుట పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని PTI కార్య‌క‌ర్త‌లు లండ‌న్ లోని అవెన్‌ఫీల్డ్ ఫ్లాట్ నందు గ‌ల నవాజ్ షరీఫ్ ఇంటి ముందు పాకిస్తాన్ జెండాలు పట్టుకుని, ప్రదర్శనలు చేప‌ట్టారు. ప్రతి పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా దూషణలు, నినాదాలు చేశారు. 

ఇంతలో.. PML-N మద్దతుదారులు కూడా పార్టీ అధినేత నవాజ్ షరీఫ్‌కు సంఘీభావం తెలిపేందుకు అవెన్‌ఫీల్డ్ ఫ్లాట్‌లకు చేరుకున్నారు. ఈ క్ర‌మంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త‌త పరిస్థితి నెల‌కొంది. ప‌రిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు అవెన్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. 
ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ సోష‌ల్ మీడియాలో వెలువడుతున్న క‌థ‌నాల‌పై ఆమె స్పందించారు. ఓ నిరసన వీడియోపై ఆమె స్పందిస్తూ.. ఒకదానిలో "పురాణా పాకిస్తాన్" అని వ్యాఖ్యానించారు. దీంతో కొనసాగుతున్న రాజకీయ గందరగోళాన్ని అపహాస్యం చేసింది. ఇమ్రాన్‌ఖాన్‌ను తొలగించిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న నినాదాలకు ఇది స్పష్టమైన సూచన.

2018లో పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు, ఇమ్రాన్ ఖాన్ "నయా పాకిస్తాన్"ను సృష్టిస్తానని ప్రతిజ్ఞ చేశాడు - పాక్ లో అవినీతిని అంతం చేస్తాన‌నీ, దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ది ప‌రుస్తాన‌ని హ‌మీ ఇచ్చారు. ఆ హామీల‌ను బేస్ చేసుకుని ఈ కామెంట్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది.  

 పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ శనివారం ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించడాన్ని ప్రశంసించారు, ఎందుకంటే అతను పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యులను 10 ఏప్రిల్ 2022ని దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన తేదీగా గుర్తించాలని కోరారు.

ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించబడిన తర్వాత పాక్ పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి బిలావల్ జర్దారీ ఏప్రిల్ 10 న జరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు మరియు ఈ రోజున పాకిస్తాన్ 1973 రాజ్యాంగాన్ని ఆమోదించిందని అన్నారు.  ఏప్రిల్ 10, 2022న,  మిమ్మల్ని పురానా పాకిస్తాన్‌కి తిరిగి స్వాగతిస్తున్నామని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో బిలావల్ అన్నారు. ఈ సంద‌ర్భంగా.. పాకిస్తానీ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. యువ‌త తాను క‌న్న కలలను ఎప్పటికీ వదులుకోవద్దనీ,  సాధ్యం కానిదేది లేద‌నీ అన్నారు.  ప్రజాస్వామ్యమే ఉత్తమ ప్రతీకారమ‌ని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu