బృందావన్ తీసుకెళ్లి.. విద్యార్థిని తినే ఆహారంలో మత్తుమందు కలిపి అత్యాచారం.. ఓ ప్రిన్సిపాల్ నీచత్వం....

By AN TeluguFirst Published Dec 12, 2022, 6:47 AM IST
Highlights

ఓ టీచర్ దారుణానికి తెగించాడు. టూర్ పేరుతో విద్యార్థులను బృందావన్ తీసుకువెళ్లి ఓ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఉత్తర ప్రదేశ్ : తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు గురువే దైవం.  కానీ ఆ గురువే ఇటీవలికాలంలో విద్యార్థినిల పాలిట అపర కీచకుడుగా మారుతున్నాడు. వయసు తేడా లేకుండా..  తన దగ్గర చదువుకునే విద్యార్థినిల పట్ల అతి దారుణంగా వ్యవహరిస్తున్నాడు. వారి మీద లైంగిక అఘాయిత్యాలకు పాల్పడి గురువు అన్న మాటకే కళంకం తీసుకొస్తున్నాడు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. ఇది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ టీచర్ కొంతమంది బాలికలను టూర్ పేరుతో  వేరే ప్రాంతాలకు తీసుకువెళ్ళాడు.  

అక్కడ ఓ హోటల్లో అందులోని ఒక బాలికకు మత్తు మందు ఇచ్చి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో  స్థానికంగా కలకలం రేగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఉత్తరప్రదేశ్ మీరట్ లోని గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఈ నీచానికి పాల్పడ్డాడు.  అతను నవంబర్ 23వ తేదీన కొంతమంది విద్యార్థినులను బృందావన్ కు టూర్ కోసం తీసుకువెళ్లాడు. రాత్రిపూట ఉండేందుకు అక్కడ హోటల్ లో రెండు రూంలు తీసుకున్నాడు. ఈ తొమ్మిది మందిలో ఎనిమిది మందిని ఒక గదిలో ఉంచాడు. 

చేతబడి చేశారనే అనుమానంతో దంపతులపై దాడి చేసి..ఆపై ..

ఇంకో గదిలో తను, తనతో పాటు పదకొండవ తరగతి చదువుతున్న 17 ఏళ్ల ఓ బాలికను ఉండమన్నాడు. ఆ తర్వాత ఆమె తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. ఆమె అది తిన్న తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపాల్ చేస్తున్న అఘాయిత్యాన్ని ఆమె ప్రతిఘటించడంతో తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. అంతేకాదు చంపేస్తానని కూడా హెచ్చరించాడు. హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఈ మేరకు వివరాలు తెలిపారు. అయితే, అటు తర్వాత విద్యార్థులంతా నవంబర్ 24న తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్లారు. 

మొదట బాధితురాలు ఈ ఘటన మీద మౌనంగానే ఉంది.  కానీ ఆ తర్వాత తల్లిదండ్రులకు దారుణం అని వివరించింది.  చూసుకోవాల్సిన  ప్రిన్సిపల్  ఇంత  నీచానికి పాల్పడడంతో ఆ తల్లిదండ్రులు షాక్ అయ్యారు. వెంటనే పట్టరాని కోపంతో కుటుంబ సభ్యులు శనివారం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ మీద  పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని.. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

click me!