PM Modi: మీ భయంతోనే వారు బలవంతంగా మద్దతిచ్చారు.. విపక్షాలపై  విరుచుకుపడ్డ ప్రధాని .

Published : Sep 27, 2023, 02:00 AM IST
PM Modi: మీ భయంతోనే వారు బలవంతంగా మద్దతిచ్చారు.. విపక్షాలపై  విరుచుకుపడ్డ ప్రధాని .

సారాంశం

PM Modi: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్‌ బిల్లును పదేళ్లుగా పెండింగ్‌లో ఉంచిన వారు చివరకు మహిళా శక్తికి భయపడి దానికి అనుకూలంగా ఓటు వేశారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అహ్మదాబాద్‌లో బిల్లును ఆమోదించిన సందర్భంగా మహిళలను అభినందించేందుకు ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.  

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం అహ్మదాబాద్ చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఇక్కడ నారీ శక్తి వందన్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ మహిళల కోసం పని చేస్తుందని పేర్కొన్నారు. పార్లమెంట్ నుంచి ప్రభుత్వం వరకు మహిళల కోసం తీసుకునే నిర్ణయాల్లో గుజరాత్ అనుభవం పెద్ద పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇక్కడ పోలీసులతో సహా అన్ని ప్రభుత్వ రిక్రూట్‌మెంట్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు అవుతోందని అన్నారు. 

ప్రతిపక్షాలపై ఫైర్ 

మీ (మహిళల) ఒత్తిడి వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని విపక్షాలపై ప్రధాని మోదీ విరుచుకపడ్డారు. నారీ శక్తి వందన్ చట్టం పార్లమెంట్‌లో రికార్డు ఓటుతో ఆమోదం పొందడం మీ (మహిళల)బలానికి ఫలితమేనని అన్నారు. దశాబ్దాలుగా ఆదరించిన ప్రజలు కూడా మీ భయంతో బలవంతంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు బలవంతంగా మద్దతు ఇవ్వడం మీ విజయమేనని అన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్ష పార్టీలు చాలా బలవంతంతో మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం యొక్క అధికారంతో త్వరలో మహిళలు లోక్‌సభ, అసెంబ్లీకి చేరుకుంటారని పేర్కొన్నారు.  నాయకత్వం కోసం మహిళలు పెద్దఎత్తున ముందుకు వస్తే, దేశం ముందుకు వెళ్లకుండా ఎవరూ ఆపలేరని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన మహిళలకు న్యాయం జరగలేదనీ, మహిళల భాగస్వామ్యం లేకుండా దేశం అభివృద్ధి చెందదని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే పార్లమెంట్‌లో మహిళల సమాన భాగస్వామ్యం అని, ఇదే మోదీ హామీ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  

ప్రధాని మోదీ షెడ్యూల్..

సెప్టెంబర్ 27న ఉదయం 10 గంటల ప్రాంతంలో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

సెప్టెంబర్ 27న మధ్యాహ్నం 1.45 గంటలకు ఛోటా ఉదయ్‌పూర్‌లోని బోడేలి చేరుకుంటారని, అక్కడ రూ.5,200 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu