PM Modi: గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని.. ప‌లు ప్రాజెక్టుల‌ను ప్రారంభించ‌నున్న మోడీ

Published : Jul 28, 2022, 11:17 AM IST
PM Modi: గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని.. ప‌లు ప్రాజెక్టుల‌ను ప్రారంభించ‌నున్న మోడీ

సారాంశం

PM Modi Gujarat Visit: గుజరాత్, తమిళనాడులో ప్రధాని న‌రేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజు ఈరోజు ప్రధాని మోడీ గుజరాత్‌లో పర్యటించనున్నారు. గుజరాత్‌లో పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు.  

PM Modi Gujarat Visit: ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి గుజరాత్,  తమిళనాడులో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. దేశంలోనే తొలి అంతర్జాతీయ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌తో సహా పలు ప్రాజెక్టులను ప్రధాని నేడు గుజరాత్‌లో ప్రారంభించనున్నారు. హిమ్మత్‌నగర్ సమీపంలో సబర్‌కాంత జిల్లా కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ (సబర్ డెయిరీ)కి చెందిన రూ. 305 కోట్ల పాలపొడి ప్లాంట్‌ను ప్రధాని మోడీ తన పర్యటనలో మొదటి రోజున ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్ రోజుకు 120 మెట్రిక్ టన్నుల పాలపొడిని ఉత్పత్తి చేస్తుంది. సబర్ డెయిరీలో రోజుకు మూడు లక్షల లీటర్ల మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారనీ, రూ.600 కోట్లతో నిర్మించే జున్ను ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారని గుజరాత్ ప్రభుత్వ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి జితు వాఘానీ తెలిపారు.

మహిళా పశువుల పెంపకందారులతో ప్రధాని మోడీ ముచ్చ‌ట !

అమూల్ బ్రాండ్ యజమాని అయిన గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF)లో సబర్ డెయిరీ ఒక భాగంగా ఉంది. ప్రధాని మోడీ తన గుజరాత్ పర్యటన సందర్భంగా సబర్‌కాంత, పొరుగున ఉన్న ఆరావళి జిల్లాలకు చెందిన 20 మంది మహిళా పశువుల రైతులతో కూడా సంభాషించనున్నారు. వారు చేస్తున్న ప‌నులు, ప్ర‌స్తుత వివ‌రాలు, ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న సాయం వంటి విష‌యాల‌పై అక్క‌డి మ‌హిళ‌ల‌తో ప్ర‌ధాని మోడీ ముచ్చ‌టించ‌నున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.  

IIBXని ప్రారంభించనున్న ప్రధాని మోడీ 

ఈ ప‌ర్య‌ట‌న సందర్భంగా గాంధీనగర్‌లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ)లో భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాన్ని (IFSC) ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. దేశంలోని మొట్టమొదటి అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజ్, ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ (IIBX) ను కూడా ప్రారంభించనున్నారు. ఈ ఎక్స్ఛేంజ్ భారతదేశంలో బంగారం ఫైనాన్సైజేషన్‌ను ప్రోత్సహిస్తుందని IFSC అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

IFSC ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన..

ఇంటిగ్రేటెడ్ రెగ్యులేటరీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ ప్రధాన కార్యాలయానికి కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, NSE IFSC-SGX కనెక్ట్‌ను కూడా ప్రారంభించనున్నారు. ఈ విధానంలో సింగపూర్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (SGX) సభ్యులు ఉంచిన నిఫ్టీ డెరివేటివ్‌లపై అన్ని ఆర్డర్‌లు NSE-IFSC ఆర్డర్ మ్యాచింగ్, ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లో రూట్ చేయబడటంతో పాటు సరిపోల్చబడతాయి. 

పీఎం మోడీ తమిళనాడు పర్యటనకు కూడా వెళ్లనున్నారు. జూన్ 19, 2022న న్యూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ స్టేడియంలో మొట్టమొదటి చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ జ్యోతి 40 రోజుల పాటు దేశంలోని 75 ప్ర‌ముఖ ప్రదేశాలకు ప్రయాణించనుంది. 44వ చెస్ ఒలింపియాడ్ చెన్నైలో జూలై 28 నుండి ఆగస్టు 9, 2022 వరకు జరుగుతోంది. 1927 నుండి నిర్వహించబడుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీ మొదటిసారిగా భారతదేశంలో, 30 సంవత్సరాల తర్వాత ఆసియాలో నిర్వహించబడుతోంది. 187 దేశాలు పాల్గొంటున్నాయి. ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu