దేశంలో కొవిడ్ను నియంత్రించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో ఆంక్షల్ని నిదానంగా ఎత్తివేస్తూ వచ్చింది. తాజాగా కరోనా వ్యాప్తిని మరింతగా కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ మార్గదర్శకాలను పొడిగించింది.
దేశంలో కొవిడ్ను నియంత్రించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో ఆంక్షల్ని నిదానంగా ఎత్తివేస్తూ వచ్చింది. తాజాగా కరోనా వ్యాప్తిని మరింతగా కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ మార్గదర్శకాలను పొడిగించింది.
నవంబర్లో ఇచ్చిన మార్గదర్శకాలను పొడిగిస్తూ హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండటంతో కేంద్రం మరిన్ని వెసులుబాటులు కల్పించింది.