వ్యక్తి మృతి: చిత్రంహిసలు పెట్టి, మర్మాంగాలకు కాల్చారు

Published : Dec 17, 2019, 01:06 PM IST
వ్యక్తి మృతి: చిత్రంహిసలు పెట్టి, మర్మాంగాలకు కాల్చారు

సారాంశం

కేరళ రాజధాని తిరువనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. మొబైల్, పర్సు దొంగిలించాడనే అనుమానంతో ఏడుగురు ఆటో డ్రైవర్లు ఓ వ్యక్తిని చితకబాది, అతని మర్మాంగాలకు పదునైన, వేడి ఆయుధంతో వాతలు పెట్టారు.

తిరువనంతపురం: అతి స్వల్ప కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిశాయి. కేరళ రాజధాని తిరువనంతపురంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మొబైల్, పర్సు దొంగిలించడానే అనుమానంపై 30 ఏళ్ల వ్యక్తిని చిత్రంహిసలు పెట్టారు. దాంతో ఆగకుండా అతని మర్మాంగాలకు నిప్పు పెట్టారు. 

కాలిన గాయాలతో ఆ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. తిరువనంతపురంలోని తిరువల్లోమ్ ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు అతన్ని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత పదునైన, వేడి ఆయుధంతో అతని మర్మాంగాలను కాల్చారు.

ఈ కేసులో నిందితులు ఆటో డ్రైవర్లని పోలీసులు చెబుతున్నారు. తిరువనంతపురం ప్రధాన బస్ స్టాండులో నిద్రిస్తున్న ఓ వ్యక్తి మొబైల్ ను, పర్సును కొట్టేశాడని చెప్పి ఆటో డ్రైవర్ ఆవ్యక్తిపై దాడి చేశారు. 

మర్మాంగాలు 40 శాతం వరకు కాలిపోయినట్లు వైద్యులు చెప్పారు. కాలిన గాయాల కారణంగానే అతను మరణించినట్లు తెలిపారు. అటుగా వెళ్తున్న వారు తీసిన వీడియోల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

38 మందికి మరణ శిక్ష గుజరాత్ హై కోర్ట్ సంచలన తీర్పు | Historic Verdict in 2008 Ahmedabad Incident
ఇండోనేషియాలో ప్రంబనన్ ఆలయందర్శించిన మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Narendra Modi Prambanan Temple Visit