మహారాష్ట్ర, హర్యానాల అసెంబ్లీలకు జరిగిన పోలింగ్కు సంబంధించి గురువారం ఓట్ల లెక్కింపు పూర్తయింది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను 3,237మంది అభ్యర్థులు... బ హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలిపోయింది.

03:59 PM (IST) Oct 24
మహారాష్ట్ర, హర్యానాల్లో ఈనెల 21వ తేదీన ముగిసిన ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఇందులో మహారాష్ట్ర లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని అందుకోగా హర్యానాలో మాత్రం కాస్త తడబడింది.
02:10 PM (IST) Oct 24
కేరళలోని ఎర్నాకులం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి టీకే వినోద్ 21 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
01:54 PM (IST) Oct 24
హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఓటమి పాలయ్యారు. ఖైతాల్ నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్ధి లీలా రామ్ చేతుల్లో 567 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
01:43 PM (IST) Oct 24
ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పును తాము గౌరవిస్తామన్నారు. ఎన్సీపీ ప్రదర్శనపై తాను సంతృప్తిగానే ఉన్నానన్నారు.
01:38 PM (IST) Oct 24
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బాగంగా పుణేలోని కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. ఈవీఎంలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎంఐఎం రీకౌంటింగ్కు డిమాండ్ చేసింది. అప్పటి వరకు కేవలం 8 రౌండ్లు మాత్రమే ముగిశాయి.
01:35 PM (IST) Oct 24
గుజరాత్లోని పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి
01:32 PM (IST) Oct 24
సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి, ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ సోషల్ మీడియా ద్వారా పార్టీ శ్రేణులకు తెలిపారు.
01:20 PM (IST) Oct 24
బీహార్లోని కిషన్గంజ్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి హుడా దాదాపు 11 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్ధి స్వీటీ సింగ్పై విజయం సాధించారు.
01:15 PM (IST) Oct 24
హర్యానాలో హంగ్ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన రీతిలో ఫలితాలు రానందుకు నైతిక బాధ్యత వహిస్తూ సుభాష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
12:55 PM (IST) Oct 24
కేరళలోని పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కోని నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో సీపీఎం అభ్యర్ధి విజయం సాధించారు.
12:45 PM (IST) Oct 24
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బరోడా నుంచి పోటీ చేసిన స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ 3,590 ఓట్ల వెనుకబడ్డారు.
12:33 PM (IST) Oct 24
పుదుచ్చేరిలోని కమల్రాజ్నగర్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి కైవసం చేసుకుంది. హస్తం పార్టీ అభ్యర్ధి జాన్ కుమార్.. ఏఐఎన్ఆర్సీ అభ్యర్థి ఎస్. భువనేశ్వరన్పై 7,170 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
12:31 PM (IST) Oct 24
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. మొత్తం 110 స్థానాల్లో బరిలో నిలిచిన ఎంఎన్ఎస్ కేవలం ఒకే ఒక్క స్థానంలో ముందంజలో నిలిచింది.
12:19 PM (IST) Oct 24
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు మేజిక్ ఫిగర్ను దాటేశాయి. అయితే గతంలో కంటే బీజేపీ సీట్లను కోల్పోయింది. అదే సమయంలో శివసేన మెరుగయ్యింది. దీంతో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటున్నారు శివసేన ఎంపీ సంజయ్ రావత్.
తాము బీజేపీతోనే కొనసాగుతామని అదే సమయంలో తమ డిమాండ్లను ఆ పార్టీ గౌరవించాలని ఆయన వ్యాఖ్యానించారు. శివసేన యువనేత ఆదిత్య థాక్రేకు సీఎం పదవిని ఇవ్వాలని తాము బీజేపీని కోరుతామని సంజయ్ స్పష్టం చేశారు. వర్లీ నుంచి బరిలోకి దిగిన ఆదిత్య దాదాపు 12 వేల ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
12:14 PM (IST) Oct 24
హర్యానా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి భూపిందర్ సింగ్ హుడా 23,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆయనతో ఫోన్లో మాట్లాడారు.
11:55 AM (IST) Oct 24
మహారాష్ట్రలో అధికారాన్ని అందుకోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలపై ఎంఐఎం నీళ్లుచల్లింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పోటీ చేసినా సుమారు 40కి పైగా స్థానాల్లో ముస్లిం ఓట్లు భారీగా ఉన్నాయి. ఆ స్థానాల్లోనే బరిలోకి దిగిన ఎంఐఎం ఆ ఓట్లను చీల్చింది. దీంతో బీజేపీ-శివసేన అభ్యర్ధులు అక్కడ ముందంజలో నిలిచారు.
11:52 AM (IST) Oct 24
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమి భారీ ఆధిక్యం సాధించినప్పటికీ కమలనాథులకు సీట్లు గతంలో కంటే తగ్గాయి. ఇదే సమయంలో శివసేన బాగా మెరుగయ్యింది. ఈ క్రమంలో సీఎం పదవి తమ పార్టీకే ఇవ్వాలని శివసేన ఎంపీ సంజయ్ రావత్ డిమాండ్ చేస్తున్నారు.
11:41 AM (IST) Oct 24
హర్యానాలో హంగ్ పరిస్ధితులు ఏర్పడిన తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫోన్లో మాట్లాడి.. పరిస్ధితి సమీక్షించారు.
11:29 AM (IST) Oct 24
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆరుగురు మంత్రులు వెనుకబడ్డారు. వీరిలో పంకజా ముండే, రామ్ షిండే, అతుల్ సవే, విజయ్ శివత్రే, బాలా బేగ్డే, మదన్ యేరావార్ ఉన్నారు.
11:22 AM (IST) Oct 24
థాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన ఆథిత్య థాక్రే విజయం దిశగా దూసుకెళ్తున్నారు. వర్లీ నుంచి బరిలోకి దిగిన ఆయన ప్రస్తుతం 12 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
11:19 AM (IST) Oct 24
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ఖట్టర్ను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. పార్టీ అధినేత, హోంమంత్రి అమిత్ షా సైతం తన పర్యటనను రద్దు చేసుకుని మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
11:04 AM (IST) Oct 24
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఉనికిని చాటుతోంది. ఔరంగాబాద్ జిల్లాలోని మూడు స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. మాలేగావ్లో ఎంఐఎం అభ్యర్ధి సుమారు 5 వేల ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
10:55 AM (IST) Oct 24
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ 14 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కర్నాల్ నుంచి ఆయన బరిలో నిలిచారు.
10:49 AM (IST) Oct 24
తమిళనాడులోని కామరాజ్ నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్-డీఎంకే అభ్యర్ధి జాన్ కుమార్ ముందంజలో ఉన్నారు.
10:46 AM (IST) Oct 24
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి చంద్రకాంత్ పాటిల్ 10 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
10:43 AM (IST) Oct 24
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ నేత అజిత్ పవార్ దూసుకెళ్తున్నారు. బారామతి నుంచి బరిలోకి దిగిన ఆయన సమీప బీజేపీ అభ్యర్ధి గోపిచంద్ పడాల్కర్పై 18 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
10:40 AM (IST) Oct 24
మాజీ కేంద్రమంత్రి గోపినాథ్ ముండే కుమార్తె పంకజా ముండే వెనుకంజలో నిలిచారు. పర్లీ నుంచి బరిలో నిలిచిన ఆమె సుమారు 4 వేల ఓట్ల వెనుకబడ్డారు.
10:33 AM (IST) Oct 24
హర్యానాలో హంగ్ ఏర్పడే అవకాశం కనిపిస్తుండటంతో బీజేపీ రంగంలోకి దిగింది. జేజేపీతో పాటు స్వతంత్రులను తమవైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటి వరకు బీజేపీ 40, కాంగ్రెస్ 29, జేజేపీ 10, ఇతరులు 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో జేజేపీకి సీఎం పదవిని ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది.
10:28 AM (IST) Oct 24
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్ది ఫాతిమా ఆధిక్యంలో ఉన్నారు
10:25 AM (IST) Oct 24
ఎన్నికల్లో తాను ఖచ్చితంగా గెలుస్తానన్నారు ప్రముఖ రెజ్లర్ బబితా కుమారి ఫొగాట్. హర్యానాలోని దాద్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన ఆమె ఫలితాల సరళిపై స్పందించారు. ఎన్నికల్లో గెలుస్తానని తనకు నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒలింపిక్ గేమ్స్లో పతకాలు సాధించడానికి నాలుగేళ్లు ఎదురుచూస్తామని.. ఇప్పుడు కూడా తనకు అలాగే అనిపిస్తుందని బబితా తెలిపారు. ప్రజలకు తనవైపున నిలిచారని.. వారి ఆశీర్వాదం తనపై ఎప్పుడూ ఉంటుందని అదే తన బలమన్నారు.
10:16 AM (IST) Oct 24
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె పరిణితీ షిండే వెనుకంజలో నిలిచారు. షోలాపూర్ సెంట్రల్ నుంచి ఆమె బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
10:13 AM (IST) Oct 24
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా వెనుకంజలో ఉన్నారు. ఎల్లెనాబాద్ నుంచి ఆయన బరిలో నిలిచారు.
10:11 AM (IST) Oct 24
పంజాబ్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3, శిరోమణి అకాలీ దళ్ 4 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి.
10:08 AM (IST) Oct 24
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ+శివసేన కూటమి మేజిక్ ఫిగర్ను దాటేసింది. కొంకణ్ ప్రాంతంలో శివసేన, ముంబై, మరఠ్వాడ ప్రాంతంలో బీజేపీ+శివసేన కూటమి ముందంజలో ఉంది. అయితే ఉత్తర, పశ్చిమ మహారాష్ట్రల్లో ఎన్సీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు.
10:04 AM (IST) Oct 24
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కూడా ఉనికిలోకి వచ్చింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్ధులు రెండింటిలోనూ ఆధిక్యంలోనూ కొనసాగుతున్నారు.
09:55 AM (IST) Oct 24
భారతీయ జనతాపార్టీకీ హర్యానాలో గట్టిపోటీ ఎదురవుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. బీజేపీ 42, కాంగ్రెస్ 28, ఇతరులు 17 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే స్వతంత్రులు, ఐఎన్ఎల్డీ మద్ధతు తప్పనిసరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
09:52 AM (IST) Oct 24
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఎన్నికల ఫలితం దోబూచులాడుతోంది. నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న ఆయన కౌంటింగ్లో పడుతూ.. లేస్తున్నారు.
09:49 AM (IST) Oct 24
బీహార్లోని సమస్తిపూర్ లోక్సభ స్ధానానికి జరుగుతున్న కౌంటింగ్లో లోక్ జనశక్తి పార్టీ అభ్యర్ధి ప్రిన్స్ రాజ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
09:45 AM (IST) Oct 24
మాజీ ఉప ప్రధాని దేవిలాల్ కుమారుడు రంజిత్ సింగ్ 9 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సిర్సా జిల్లా రానియా నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలిచారు.
09:33 AM (IST) Oct 24
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ+శివసేన కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం 168 స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ.. అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను దాటేశాయి.