మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలుడి కిడ్నాప్.. వారం రోజుల తర్వాత ముంబైలో ఆచూకీ..

Published : Jul 21, 2023, 05:31 AM IST
 మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలుడి కిడ్నాప్.. వారం రోజుల తర్వాత ముంబైలో ఆచూకీ..

సారాంశం

వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్‌ నుంచి అపహరణకు గురై 12 ఏళ్ల బాలుడిని ముంబైలో కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. ముంబై క్రైం బ్రాంచ్‌లోని యూనిట్ 10 సిబ్బంది బుధవారం అంధేరీ ప్రాంతంలో బాలుడు సంచరిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లా నుంచి కిడ్నాప్‌కు గురైన 12 ఏళ్ల బాలుడు వారం రోజుల తర్వాత ముంబైలో దొరికాడు. వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి  12 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేశాడు. ఆ బాలుడి ఆచూకీ ముంబైలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌లోని యూనిట్ 10 సిబ్బంది బుధవారం అంధేరి ప్రాంతంలో బాలుడిని కనుగొన్నట్లు పోలీసు అధికారి తెలిపారు.

పోలీసులు ఆ బాలుడితో మాట్లాడినప్పుడు.. ఆ పిల్లవాడుచాలా భయపడ్డాడు. తాను మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలోని తన గ్రామం పేరు మాత్రమే చెప్పాడు. క్రైమ్ బ్రాంచ్ అధికారులు మధ్యప్రదేశ్  పోలీసులను సంప్రదించగా జూలై 11న ఆ బాలుడు అపహరణకు గురైనట్లు సమాచారం. బాలుడి కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ పోలీసుల బృందంతో కలిసి ముంబైకి చేరుకుని ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు. మధ్యప్రదేశ్ స్థానిక పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

పెళ్లికి అడ్డొచ్చిన జాత‌కం, శారీర‌కంగా క‌ల‌వ‌డానికి రాలేదా.? హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం