LPG Vessel Shivalik: యుద్ధాన్ని,మిసైళ్లను తప్పించుకొని భారత్ చేరుకున్న మరో నౌక | Asianet News Telugu

Published : Mar 16, 2026, 09:21 PM IST

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హర్మూజ్ జలసంధి దాటి భారత LPG ట్యాంకర్ సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉన్న ముంద్రా పోర్ట్ వద్ద ఈ నౌక డాక్ అయిన తాజా దృశ్యాలు. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఆయిల్ ట్రాన్సిట్ మార్గమైన హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ ఆయిల్ సరఫరాలో సుమారు 20% రవాణా జరుగుతుంది. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర మార్గాలపై భద్రతా ఆందోళనలు ఉన్నప్పటికీ, భారత గృహ వినియోగ LPG సరఫరాకు కీలకమైన ఈ నౌక సురక్షితంగా ముంద్రా పోర్ట్ చేరడం ప్రజలకు కొంత ఊరట కలిగించే పరిణామంగా భావిస్తున్నారు.