బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు.. మరణశిక్ష.. 92 ఏండ్ల జైలు శిక్ష 

Published : Jul 23, 2023, 05:33 AM IST
బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు.. మరణశిక్ష.. 92 ఏండ్ల జైలు శిక్ష 

సారాంశం

కేరళ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.  ఆరేళ్ల బాలుడ్ని హత్య చేసి.. అతని 14 ఏళ్ల సోదరిని అత్యాచారం చేసిన కేసులో  నిందితుడికి మరణశిక్షతో పాటు ఏకంగా 92 ఏండ్ల జైలు శిక్ష విధించింది. 

ఆరేళ్ల బాలుడ్ని హత్య చేసి.. అతని 14 ఏళ్ల సోదరిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.  నిందితుడికి మరణశిక్షతో పాటు ఏకంగా 92 ఏండ్ల జైలు శిక్ష విధించింది.  కేరళలోని ఇడుక్కికి చెందిన ముహమ్మద్ షాన్ అనే 44 ఏళ్ల వ్యక్తి తన  పొరుగువారితో శత్రుత్వం కారణంగా మైనర్ బాలుడిని కొట్టి చంపాడు. అంతే కాదు ఇద్దరు మహిళలను గాయపరిచి 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. హత్య కేసులో నిందితులకు మరణశిక్ష, ఇతర కేసుల్లో జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ కేరళ కోర్టు తీర్పునిచ్చింది.

 జరిమానా చెల్లించకుంటే 11 ఏళ్లు అదనంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కేరళలోని ప్రత్యేక పోక్సో కోర్టు శనివారం బాధితురాలి తల్లి , అమ్మమ్మపై దాడి చేసినందుకు అదనంగా 92 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.9.91 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లింపులో విఫలమైతే.. నిందితుడికి అదనంగా 11 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించింది. ఈ నేరాన్ని అత్యంత హేయమైనదిగా పేర్కొన్న కోర్టు దోషి బాధితుల బంధువని పేర్కొంది. 

ఇదీ జరిగింది..

ఈ సంఘటన ఇడుక్కిలోని మున్నార్ సమీపంలోని వెల్లతువల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 3, 2021 న జరిగింది. నిందితుడు కుటుంబీకులతో గొడవపడి తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో బాధితురాలి ఇంటి వెనుక తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు.

బిడ్డతో పాటు నిద్రిస్తున్న తల్లిపై సుత్తితో దాడి చేసి.. చిన్నారిని సుత్తితో కొట్టి చంపాడు. దీంతో నిందితులు సమీపంలోని ఇంటికి వెళ్లి చనిపోయిన చిన్నారి అమ్మమ్మ, అక్క నిద్రిస్తున్న వారిపై దాడి చేశారు. అమ్మమ్మపై దారుణంగా దాడి చేసి 14 ఏళ్ల బాలికను అక్కడి నుంచి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడని ప్రాసిక్యూషన్ తెలిపింది. బాలిక తప్పించుకుని స్థానికులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

PREV
click me!

Recommended Stories

Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu
LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!