చంద్రయాన్-2 తీసిన ఫోటోలను ఇస్రో ఆదివారం నాడు విడుదల చేసింది. చంద్రయాన్ -2 విక్రమ్ లాండర్ తన కెమెరాలో బంధించిన ఫోటోలను ఇస్రో ట్వీట్ చేసింది.
న్యూఢిల్లీ: చంద్రయాన్-2 విక్రమ్ లాండర్ తీసిన భూమికి చెందిన ఫోటోలను ఇస్రో ఆదివారం నాడు ఉదయం విడుదల చేసింది. చంద్రయాన్-2 విక్రమ్ లాండర్ భూమి ఫోటోలను ఎల్14 కెమెరాలో బంధించింది.
ISRO (Indian Space Research Organisation): Earth as viewed by LI4 Camera on August 3, 2019. pic.twitter.com/QKU9iL8O8m
— ANI (@ANI)
చంద్రయాన్-2 లోని అన్ని విభాగాలు విజయవంతంగా సాగుతున్నాయని ఇస్రో రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఆగష్టు 6 వతేదీన ఆర్బిట్ కక్ష్య పెంచనున్నట్టు ఇస్రో ప్రకటించింది.
ఒకటి, రెండు, మూడు ఆర్బిట్ల కక్ష్య పెంపులు విజయవంతమయ్యాయి. చంద్రయాన్-2 ఈ నెల 20వ తేదిన చంద్రుడిపై చేరుకోనుంది. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడి ఉపరితలంపైకి చేరుకొనేలా ఇస్రో ప్లాన్ చేసింది.చంద్రయాన్-2ను ఈ ఏడాది జూలై 22వ తేదిన ప్రయోగించారు. ఈ ప్రయోగంలోని నాలుగు దశలు విజయవంతంగా పూర్తయ్యాయి.