చెన్నై స‌హా త‌మిళ‌నాడులోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం.. స్కూళ్ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన స‌ర్కారు

Published : Jun 19, 2023, 10:52 AM IST
చెన్నై స‌హా త‌మిళ‌నాడులోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం.. స్కూళ్ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన స‌ర్కారు

సారాంశం

Chennai: భారీ వర్షాల కారణంగా చెన్నై వెళ్లాల్సిన ఆరుకు పైగా అంతర్జాతీయ విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. వర్షాల కారణంగా డజను అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. దోహా, దుబాయ్ సహా దాదాపు 10 విమానాలను బెంగళూరుకు మళ్లించడంతో విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.  

Heavy Rains: రికార్డు స్థాయిలో ఎండలు దంచికొడుతున్న త‌మిళ‌నాడులో ఆదివారం సాయంత్రం ఒక్క‌సారి వాతావ‌ర‌ణం మారిపోయింది. రాత్రి చెన్నై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ఎండ‌ల‌ను నుంచి  కొంత ఉపశమనం లభించింది. వాతావరణం ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి వ‌చ్చాయి. వర్షాల కారణంగా చెన్నై, దాని పొరుగు జిల్లాలైన చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరుతో పాటు వేలూరు, రాణిపేటలోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.

వివ‌రాల్లోకెళ్తే.. తమిళనాడులోని పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి విస్తారంగా భారీ వర్షాలు కురిశాయి. చెన్నై సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం కురవడంతో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, రాణిపేట జిల్లాల్లోని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. "నిన్న రాత్రి చెన్నై అంతటా విస్తారంగా భారీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 137.6 గంటల నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు మీనంబాక్కంలో 5.30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది" అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అలాగే, తారామణి, నందనం ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లు, చెంబరంబాక్కంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాల కారణంగా చెన్నై వెళ్లాల్సిన ఆరుకు పైగా అంతర్జాతీయ విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. వర్షాల కారణంగా డజను అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. దోహా, దుబాయ్ సహా దాదాపు 10 విమానాలను బెంగళూరుకు మళ్లించడంతో విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

సోమవారం తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అంత‌కుముందు ఐఎండీ తెలిపింది. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువణ్ణామలై, కల్లకురిచ్చి, విల్లుపురం, కడలూరు, మైలాడుదురై, నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరుతో పాటు పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం నుంచి గురువారం వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu