మంత్రి ప్రయాణిస్తున్న విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం

Published : Sep 30, 2019, 01:18 PM ISTUpdated : Sep 30, 2019, 01:20 PM IST
మంత్రి ప్రయాణిస్తున్న విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం

సారాంశం

విమానంలో గోవా పర్యవరణ శాఖ మంత్రి నీలేశ్ కాబ్రాల్ కూడా ఉన్నారు. గోవా దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గోవా నుంచి ఢిల్లీ బయలుదేరిన పదిహేను నిమిషాల తరువాత ఇంజీన్‌లో మంటలంటుకున్నాయని మంత్రి నీలేశ్‌ తెలిపారు. 

ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. 180మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  అయితే.... వెంటనే అప్రమత్తమైన పైలెట్.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా... ఆ సమయంలో విమానంలో గోవా పర్యవరణ శాఖ మంత్రి నీలేశ్ కాబ్రాల్ కూడా ఉన్నారు. గోవా దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గోవా నుంచి ఢిల్లీ బయలుదేరిన పదిహేను నిమిషాల తరువాత ఇంజీన్‌లో మంటలంటుకున్నాయని మంత్రి నీలేశ్‌ తెలిపారు. 

పైలట్ వెంటనే ఎడమ ఇంజీన్‌ ఆపివేసి తమను తిరిగి గోవాకు ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారని తెలిపారు.  తనతో సహా మిగిలిన 180 మంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అధికారిక సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీకి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు మంత్రి  చెప్పారు.

PREV
click me!

Recommended Stories

38 మందికి మరణ శిక్ష గుజరాత్ హై కోర్ట్ సంచలన తీర్పు | Historic Verdict in 2008 Ahmedabad Incident
ఇండోనేషియాలో ప్రంబనన్ ఆలయందర్శించిన మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Narendra Modi Prambanan Temple Visit