జమ్మూ కాశ్మీర్ లో లోయలో పడ్డ టెంపో ట్రావెలర్, ఐదుగురు మృతి, 10మందికి గాయాలు...

Published : Aug 05, 2022, 02:06 PM IST
జమ్మూ కాశ్మీర్ లో లోయలో పడ్డ టెంపో ట్రావెలర్, ఐదుగురు మృతి, 10మందికి గాయాలు...

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లో ఓ టెంపో ట్రావెలర్ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 10మంది గాయపడ్డారు. 

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టెంపో ట్రాలీ లోయలో పడిన ప్రమాద ఘటనలో ఐదుగురు మరణించగా.. మరో 10 మంది గాయపడ్డారు. రాంబన్ జిల్లాలో జమ్మూ నుంచి బన్నీహాల్ కు టెంపో ట్రాలీలో వెళుతుండగా ప్రమాదవశాత్తు లోయలో పడింది. లోయలో పడే ముందు టెంపో ఓ కారును ఢీకొంది అని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లనే  ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు

ఇదిలా ఉండగా, థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా ఉన్న థాయ్‌లాండ్‌లోని చోన్‌బురి ప్రావిన్స్‌లోని నైట్‌క్లబ్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు.  35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీసు అధికారులు సమాచారం తెలిపారు.

ఐదేళ్ల కూతురిని నాలుగో అంతస్తునుంచి పడేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే..

ఈ అగ్నిప్రమాదం సత్తాహిప్ జిల్లాలోని మౌంటైన్ B నైట్‌క్లబ్‌లో జరిగింది. ఇది సుమారు 1:00 గంటలకు (1800 GMT గురువారం) ప్రారంభమైందని తెలుస్తోంది. ఇప్పటి వరకు గుర్తించిన బాధితులందరూ థాయ్ జాతీయులని పోలీసు కల్నల్ వుట్టిపోంగ్ సోమ్‌జై టెలిఫోన్ ద్వారా తెలిపారు.

PREV
click me!

Recommended Stories

PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్
గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?