రక్షాబంధన్ వేళ విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి.. ఐదుగురు చిన్నారులు మృతి..

Published : Sep 01, 2023, 08:36 AM IST
రక్షాబంధన్ వేళ విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి.. ఐదుగురు చిన్నారులు మృతి..

సారాంశం

రాఖీ పండగ ఓ ఐదుగురు చిన్నారుల జీవితాల్లో విషాదాన్ని నింపింది.   తోడబుట్టిన వారితో రాఖీలు కట్టించుకున్న ఐదుగురు చిన్నారులు ఈత కోసం చెరువులోకి దిగి మృత్యువాత పడ్డారు. 

బీహార్ : బీహార్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో ఐదుగురు చిన్నారులు చెరువులో మునిగి మృతి చెందారు. ఔరంగాబాద్ జిల్లాలోని సలాయ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సోనార్చాక్ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ గ్రామంలోని చిన్నారులంతా రాఖీ సందర్భంగా  తమ అక్క చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకున్నారు.

రక్షాబంధన్ వేడుక ముగిసిన తర్వాత గ్రామానికి సమీపంలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్లారు. అక్కడ చెరువులో స్నానం చేయడానికి దిగారు. అయితే చిన్నారులు దిగిన ప్రాంతంలో చెరువు కాస్త లోతుగా ఉంది. అది గమనించుకోకపోవడంతో నీటిలో మునిగిపోయారు. విషయం తెలిసిన గ్రామస్తులు చిన్నారుల మృతదేహాలను వెతికి వెలికి తీశారు.  సమాచారం పోలీసులకు అందించడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Army Training Aircraft Crashes: ప్రమాదానికి గురైన విమానం ఎలా రక్షిస్తున్నారో చూడండి | Asianet Telugu
Sabarimala : బంగారం రాగిగా ఎలా మారింది? శబరిమల గుట్టు రట్టు.. హైకోర్టు చివాట్లు ! ఈడీ పంజా