స్టాన్ స్వామి కేసులో.....యూఎస్ షాకింగ్ నివేదిక...!

Published : Dec 14, 2022, 02:31 PM IST
 స్టాన్ స్వామి కేసులో.....యూఎస్ షాకింగ్ నివేదిక...!

సారాంశం

తాజాగా ఆయన మరణం విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయన కేసులో యూఎస్ కు చెందిన ఓ ఫోరెన్సిక్ సంస్థ కీలక ఆధారాలు బయటపెట్టడం గమనార్హం.

ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద  అరెస్ట్ అయిన ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన కస్టడీలో ఉండగానే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.  కాగా.. తాజాగా ఆయన మరణం విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయన కేసులో యూఎస్ కు చెందిన ఓ ఫోరెన్సిక్ సంస్థ కీలక ఆధారాలు బయటపెట్టడం గమనార్హం.

మహారాష్ట్రలోని బీమా-కోరేగావ్‌లో 2018 జనవరిలో చోటుచేసుకున్న అల్లర్లలో మావోయిస్టుల కుట్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో భాగంగా స్టాన్ స్వామిని 2020 అక్టోబర్​లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అయితే.. అనారోగ్య కారణాల కారణంగా ఆయన ప్రాణాలు విడిచారు. తాజాగా.. ఆయన కేసుకు సంబంధించి యూఎస్ కి చెందిన ఫోరెన్సిక్ నివేదిక విడుదల చేసిన ఆధారాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి.

స్టాన్ స్వామి ల్యాప్ టాప్ ను హ్యాక్ చేసి అందులో ఇందుకు సంబంధించిన ఆధారాలను అమర్చారని ఫోరెన్సిక్ సంస్ధ ఆర్సెనిక్ కన్సల్టింగ్ గుర్తించింది. స్వామి తరపు న్యాయవాదులు నియమించిన బోస్టన్‌కు చెందిన ఫోరెన్సిక్ సంస్థ ఆర్సెనల్ కన్సల్టింగ్ తన అధ్యయనంలో మావోయిస్టు లేఖలు అని చెప్పిన 44 పత్రాల్ని గుర్తుతెలియని వ్యక్తి సైబర్ దాడి చేసి స్వామి కంప్యూటర్‌లోకి ప్రవేశించి చాలా కాలం పాటు పెట్టాడని వెల్లడించిది. 2014 నుండి ప్రారంభించి 2019లో సైబర్ దాడికి గురయ్యే వరకు ఇలా పలు డాక్యుమెంట్లు ఆయన ల్యాప్ టాప్ లో పెట్టారని గుర్తించారు.ఈ కథనాన్ని వాషింగ్టన్ పోస్ట్ కూడా నివేదించింది.

గిరిజనుల కోసం  పనిచేసిన జార్ఖండ్‌కు చెందిన జెస్యూట్ పూజారి స్వామిని భీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేశారు, ఈ చర్య తీవ్ర ఖండనకు దారితీసింది. కోవిడ్-సంబంధిత సమస్యల కారణంగా అతను జైలులో ఉన్న ఒక సంవత్సరంలోపు మరణించడంతో విమర్శలు పెరిగాయి. ఫాదర్ స్టాన్ స్వామి మరణ వార్తపై UN మరియు EU రెండూ తీవ్రంగా స్పందించాయి.

అయితే, 2018లో మహారాష్ట్రలోని భీమా-కోరెగావ్ గ్రామంలో దళితులు అగ్రవర్ణ సైన్యాన్ని ఓడించిన చారిత్రాత్మక పోరును గుర్తుచేసుకోవడానికి అనేక మంది దళితులు గుమిగూడి అల్లర్లను ప్రేరేపించడానికి మరో 15 మందితో కలిసి కుట్ర పన్నారని NIA పేర్కొంది. .

వారి కంప్యూటర్ల నుండి తిరిగి పొందిన పత్రాల ఆధారంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపడానికి మావోయిస్టులతో కలిసి కుట్ర పన్నారని స్వామి, ఇతరులపై - ప్రధానంగా వామపక్షవాద కార్యకర్తలు, విద్యావేత్తలు, మానవ హక్కుల పరిరక్షకులపై NIA అభియోగాలు మోపింది.

ఇప్పుడు, అతను మరణించిన సుమారు 17 నెలల తర్వాత, ఆర్సెనల్ కన్సల్టింగ్ యొక్క నివేదిక ప్రకారం, హ్యాకర్ 19 అక్టోబర్ 2014న ఫాదర్ స్వామి కంప్యూటర్‌ను యాక్సెస్ చేయడానికి నెట్‌వైర్ అనే మాల్వేర్‌ను ఉపయోగించాడని తేలడం గమనార్హం.


 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్