ఢిల్లీ లిక్కర్ స్కాం: సప్లిమెంటరీ చార్జీషీట్‌లో మాగుంట రాఘవ సహా ముగ్గురి పేర్లు

Published : Apr 06, 2023, 03:06 PM ISTUpdated : Apr 06, 2023, 03:14 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాం: సప్లిమెంటరీ చార్జీషీట్‌లో మాగుంట రాఘవ సహా  ముగ్గురి  పేర్లు

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈడీ  ఇవాళ  సప్లిమెంటరీ చార్జీషీట్ ను  దాఖలు  చేసింది. ఈ చార్జీషీట్ లో  ముగ్గురిపై  అభియోగాలు  మోపింది. 

న్యూఢిల్లీ:  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సప్లిమెంటరీ చార్జీషీట్ ను  గురువారంనాడు ఈడీ  దాఖలు చేసింది. ముగ్గురు నిందితుపై  అభియోగాలు నమోదు  చేసింది  ఈడీ,  మాగుంట  రాఘవ , రాజేష్  జోషి, గౌతమ్ మల్హోత్రా పై  అభియోగాలు మోపింది  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ . ఈ ఏడాది ఫిబ్రవరి  మాసంలో   అరెస్ట్ చేసిన  నిందితుల  విచారణకు  సంబంధించిన  అంశాలను  ఈ చార్జీషీట్ లో  ఈడీ ప్రస్తావించింది.  

ఢిల్లీ లిక్కర్ స్కాంపై  గత ఏడాది నవంబర్  26న  తొలి చార్జీషీట్ ను  ఈడీ  కోర్టుకు  సమర్పించింది.  ఈ ఏడాది  ఫిబ్రవరి మాసంలో  ఈడీ  రెండో చార్జీషీట్ ను దాఖలు  చేసింది . రెండో చార్జీషీట్ లో మనీష్ సిసోడియా,  అరవింద్ కేజ్రీవాల్,  కవిత పేర్లను ఈడీ  చేర్చింది. తాజాగా సప్లిమెంటరీ  చార్జీషీట్ ను దాఖలు  చేసింది. ఈ సప్లిమెంటరీ చార్జీషీట్ లో  ముగ్గురి పేర్లను   ఈడీ పేర్కొంది.  అయితే ఈ  చార్జీషీట్ ను  ఈ నెల  14న స్వీకరించనున్నట్టుగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ  కోర్టు   తెలిపింది

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్