దారుణం : నోట్లో పేలిన నాటు బాంబు.. ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ఏనుగు

Siva Kodati |  
Published : Sep 06, 2023, 02:27 PM IST
దారుణం : నోట్లో పేలిన నాటు బాంబు.. ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ఏనుగు

సారాంశం

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఆరేళ్ల ఆడ ఏనుగు నోటిలో నాటు బాంబు పేలింది. దీంతో ఏమి తినలేక ఆకలితో ప్రాణాలొదిలింది . ఇటీవలే కేరళ నుంచి తమిళనాడులోని అటవీ ప్రాంతంలోకి బాధిత ఏనుగు ప్రవేశించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. 

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఆరేళ్ల ఆడ ఏనుగు నోటిలో నాటు బాంబు పేలింది. దీంతో ఏమి తినలేక ఆకలితో ప్రాణాలొదిలింది. అడవి పందులు తమ పొలాల్లోకి రాకుండా నిరోధించడానికి అవుత్తుకై అని పిలిచే బాంబును ఇక్కడి స్థానికులు పండ్లు , కూరగాయాలలో పెట్టి వుంచుతారు. ఏదైనా జంతువు దానిని కొరికినప్పుడు అది పేలి.. జంతువు నోటికి తీవ్ర గాయమవుతుంది. ఈ నేపథ్యంలో తడగాం అటవీ రేంజ్‌లోని ఇటుక బట్టీ సమీపంలో ఏనుగు సంచరిస్తోందని స్థానికులు అటవీ అధికారులను అప్రమత్తం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

సమాచారం అందుకున్న అధికారులు, పశువైద్య బృందం ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర గాయంతో బాధపడుతున్న ఏనుగుకు ఇంట్రావీనస్ మెడిసన్, గ్లూకోజ్ అందించారు. ఈ క్రమంలో నిషేధిత ‘‘అవుట్టుకై’’ అనే నాటు బాంబును ఏనుగు కొరికినట్లుగా పశువైద్య బృందం గుర్తించింది. ఇటీవలే కేరళ నుంచి తమిళనాడులోని అటవీ ప్రాంతంలోకి బాధిత ఏనుగు ప్రవేశించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఏనుగు ఈ బాంబును ఎక్కడ కొరికిందో తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

CJP: ఒక్క కామెంట్.. ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ రీల్.. కేంద్ర మంత్రిని కుర్చీ దింపేసిన Gen Z పవర్ !
ఎవరీ ప్రహ్లాద్ జోషి.? మోదీ ఈయననే కొత్త విద్యా శాఖ మంత్రిగా ఎందుకు సెలక్ట్ చేశారు.?