ఢిల్లీ తల్లీ తన బిడ్డను నమ్మింది: ఎన్నికల్లో విజయంపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 11, 2020, 04:12 PM ISTUpdated : Feb 11, 2020, 04:17 PM IST
ఢిల్లీ తల్లీ తన బిడ్డను నమ్మింది: ఎన్నికల్లో విజయంపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు

సారాంశం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇది ఢిల్లీ ప్రజల విజయమన్న ఆయన నూతన రాజకీయాలకు ఢిల్లీ ప్రజలు నాంది పలికారని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇది ఢిల్లీ ప్రజల విజయమన్న ఆయన నూతన రాజకీయాలకు ఢిల్లీ ప్రజలు నాంది పలికారని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ తల్లి తన కుమారుడిని మళ్లీ నమ్మి గెలిపించిందని పనిచేసే వారికే పట్టం కడతారని ప్రజలు నిరూపించారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించాయని, మరో ఐదేళ్ల పాటు కష్టపడి పనిచేస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కేజ్రీవాల్ తన సమీప ప్రత్యర్థిపై 13,508 ఓట్ల తేడాత ఘన విజయం సాధించారు. 

అంతకుమందు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. పట్‌పర్ గంజ్ నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బీజేపీ విద్వేష రాజకీయాలను చేసిందని.. కానీ ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని గుర్తుచేశారు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !