కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకారమే కీలకం : ప్రధాని నరేంద్ర మోడీ

Published : Feb 20, 2021, 11:58 AM ISTUpdated : Feb 20, 2021, 11:59 AM IST
కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకారమే కీలకం : ప్రధాని నరేంద్ర మోడీ

సారాంశం

కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సహకారం చాలా ముఖ్యమైనదని ఈరోజు జరిగిన నీతీ ఆయోగ్ మీటింగ్ లో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ముందుగా మనం అలవర్చుకోవాలని నొక్కి వక్కాణించారు. దేశ ప్రజల జీవితాలు మెరుగు పరచడానికి ఇది పనికి వస్తుందని తెలిపారు. 

కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సహకారం చాలా ముఖ్యమైనదని ఈరోజు జరిగిన నీతీ ఆయోగ్ మీటింగ్ లో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ముందుగా మనం అలవర్చుకోవాలని నొక్కి వక్కాణించారు. దేశ ప్రజల జీవితాలు మెరుగు పరచడానికి ఇది పనికి వస్తుందని తెలిపారు. 

ఈ యేటి బడ్జెట్ కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ దేశపు మానసిక స్థితిని తెలుపుతుందని అన్నారు. దేశప్రజలు సత్వర అభివృద్ధిని కోరుకుంటున్నారని, సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపపడం లేదని అన్నారు. దేశం యొక్క మూడ్ ను మార్చే దిశగా యువత ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధాని అన్నారు.

నీతి ఆయోగ్ ఆరవ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు, ముఖ్యమంత్రులు, మంత్రులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్-గవర్నర్లు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు.

ఈ సమావేశపు ఎజెండాలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, మాన్యుఫాక్చరింగ్, మానవ వనరుల అభివృద్ధి, అట్టడుగు స్థాయిలో సేవా పంపిణీ, ఆరోగ్యం, పోషణ ఉన్నాయి.

ఈ సమావేశంలో కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ మొదటిసారి పాల్గొంటుంది. జమ్మూ కాశ్మీర్ కూడా ఈ సమావేశానికి హాజరవుతోంది.  ఈ సమావేశంలో పాలక మండలి ఎక్స్-అఫిషియో సభ్యులు, కేంద్ర మంత్రులు, వైస్ చైర్మన్, సభ్యులు,  ఎన్‌ఐటిఐ ఆయోగ్ సిఇఒ, భారత ప్రభుత్వ ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారని ప్రధాని కార్యాలయం తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Cheapest Car in India : 6 ఎయిర్‌బ్యాగ్స్, 32 kmpl మైలేజ్ తో .. ఇండియాలో అత్యంత చౌక కారు ఇదే
Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu