తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. బుధవారం జరిగిన బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం మెజార్టీ సాధించి విజయం దక్కించుకుంది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే సీఎం విజయ్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సభలో వేడెక్కిన చర్చలు జరిగాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.